డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు..
విడుదలైన టెట్ ప్రకటన
త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఉమ్మడి జిల్లాలో 2,551 ఖాళీల గుర్తింపు
భారత క్రికెట్ జట్టు గెలుపే స్ఫూర్తి పాఠం
కర్నూలు, నంద్యాల విద్య, న్యూస్టుడే : మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. మరో వారంలో డీఎస్సీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,551 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరి గెలుపు ‘క్యాచ్’ అందాలంటే ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి. ఒత్తిడిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. ఇలాంటి గెలుపు సూత్రాలతోనే భారత క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచి టీ20 ప్రపంచ కప్ను చేజిక్కించుకుంది. ఆ సమష్టి కృషి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతిఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.
రెండు నెలల గెలుపు పోరు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. ఒత్తిడిని అధిగమించి విజయతీరాలకు చేరాలంటే.. భారత జట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఆటకు మలుపు. బంతి బౌండరీ దాటేలోపే సమయస్ఫూర్తితో ఒడిసిపట్టిన తీరు విజయానికి కీలకమైంది. పట్టుదల, ఏకాగ్రతతో పాటు చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే.. కొలువు మీ సొంతమవుతుంది.
గత ఓటములే గుణపాఠాలు
2023 నవంబరులో జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చెందింది. ఆ సమయంలో ఎన్నో అవమానాలు, ఒత్తిళ్లు ఎదుర్కొంది. అయినాసరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది. లోపాలను సరిదిద్దుకుని పట్టుదలతో టీ20 ప్రపంచ కప్లో అడుగుపెట్టింది. పొరపాట్లకు తావివ్వకుండా గ్రూప్ దశ నుంచి రాణించి జగజ్జేతగా నిలిచింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్లాడి కోహ్లి చేసింది 5 పరుగులే. సూపర్-8లోనూ ప్రదర్శన అంతంతమాత్రం. సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే.. అక్కడా నిరాశే. ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ను ఆరంభించి.. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడి.. ఆపై చివర్లో చెలరేగి ఇన్నింగ్స్కు మంచి ముగింపునిచ్చాడు విరాట్. గతంలో విఫలమయ్యామని, ఫలానా సబ్జెక్టు కఠినంగా ఉందని నిరుద్యోగ అభ్యర్థులు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమవ్వాలి.
ప్రణాళికే కీలకం
దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ స్పిన్నర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ భారీ స్కోర్లు చేస్తుండటంతో టీం ఇండియా వ్యూహాన్ని మార్చింది. పేసర్లను రంగంలోకి దించి వికెట్ రాబట్టింది. చివరి ఐదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసిందంటే ప్రణాళిక ప్రకారం వ్యూహాలు అమలు చేశారు. పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు కూడా కఠిన దశను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఏం చదవాలోనన్న గందరగోళానికి గురవకుండా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వాలి.
సమష్టి అధ్యయనం కీలకం
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ కోహ్లి, అక్షర్ బ్యాటింగ్లో రాణించడంతో మంచి స్కోర్ సాధ్యమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడంలో బౌలరు,్ల ఫీల్డర్లు చురుగ్గా వ్యవహరించారు. సమష్టి కృషితో విజయం సొంతమైంది. పోటీ పరీక్షల వేళ నలుగురు, ఐదుగురు మిత్రులు బృందంగా ఏర్పడి చదువుకుంటే సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. లోపాలను సవరించుకుంటూ విజయ తీరాలకు చేరవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గదులు కూల్చారు.. చదువుకు గండం తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
పురుగుల అన్నం తినలేకున్నాం
[ 06-07-2024]
‘అన్నంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయి. వెంట్రుకలు వస్తున్నాయి. ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. -
గదులు కూల్చారు.. భావితరానికి చిక్కులు తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
ఆక్రమణలకేసీ చూడండి
[ 06-07-2024]
రెండు లక్షల ఎకరాలకు సాగు.. వందలాది రైతు కుటుంబాల జీవనాధారమైన కేసీ కాల్వను వైకాపా నేతలు ఛిద్రం చేశారు.. కాల్వ వెంట ఉన్న ఖాళీ స్థలాలకు కబ్జా చేసి సాగునీటికి అడ్డుకట్ట వేశారు. -
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
[ 06-07-2024]
వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన, ఎరువుల, పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
పేదింటి బిడ్డలు.. ప్రతిభలో శ్రీమంతులు
[ 06-07-2024]
వారంతా పేదింటి బిడ్డలు.. ప్రతిభలో మాత్రం శ్రీమంతులు. లక్ష్మీ కటాక్షం లేకపోవచ్చు.. సరస్వతి అనుగ్రహం మాత్రం పుష్కలం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. మరో వైపు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. -
శ్రీశైలంలో శిలపై శివలింగం గుర్తింపు
[ 06-07-2024]
శ్రీశైల మహాక్షేత్రంలోని రుద్రాక్షమఠం-సారంగధారమఠం మధ్య బండరాతి శిలపై చెక్కిన శివలింగాన్ని గుర్తించారు. అక్కడ రహదారి విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా గురువారం శివలింగం ఆకారాన్ని కనుగొన్నారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 06-07-2024]
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి వేళాయె!
[ 06-07-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటికే ప్రకటన విడుదల కాగా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ప్రవేశాలు జరపనున్నారు. -
భక్తి పేరుతో భూముల స్వాహా
[ 06-07-2024]
మండల పరిధిలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఓ వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారు. -
విజయవాడ నుంచి త్వరలో విమాన సర్వీసులు
[ 06-07-2024]
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
[ 06-07-2024]
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడినప్పుడే సంపూర్ణ అభియాన్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ రంజిత్బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్, నీతీ ఆయోగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ స్మృతి సబర్వాల్, ఆర్డీవో రామలక్ష్మి తదితరులు అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 06-07-2024]
జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ ఒక ప్రకటనలో కోరారు. -
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
[ 06-07-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్లో జరిగిన లా 3, 5వ ఏడాదికి సంబంధించి 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.