బడి బువ్వ బాలేదు
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
తినేందుకు విద్యార్థుల అనాసక్తి
నాణ్యతాలేమిపై తాఖీదులు
ఎమ్మిగనూరు: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలో ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న విద్యార్థినులు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. హాజరైన వారందరికీ భోజనం వండుతున్నా చాలామంది తినడం లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. గొప్ప మెనూ అమలు చేస్తున్నాం.. పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామంటూ.. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం గొప్పలు పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేందుకు ఇష్టపడడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై నిఘా పెట్టింది. ఇప్పటికే నాణ్యత సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదులు వచ్చిన పాఠశాలలకు తాఖీదులు జారీ అయ్యాయి.
నాణ్యతపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మధ్యాహ్నం భోజనం నాణ్యతపై అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అన్నం మెత్తగా ఉంటోందని, మెతుకులు లావుగా ఉన్నాయని, పప్పు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. 90 శాతం విద్యార్థులు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలాచోట్ల 80 శాతం మందే తింటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విద్యార్థులు హాజరుతో పాటు భోజనం తినేవారి సంఖ్యను ఆన్లైన్లో అధికారులు గమనించారు. వ్యత్యాసం అధికంగా ఉండటంతో క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలల్లో భోజనం తినే విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు సరిగ్గా ఇవ్వడం లేదు. కచ్చితమైన వివరాలు నమోదు చేయడం లేదు. విద్యార్థుల సంఖ్య కచ్చితంగా నమోదు చేస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న ఉపాధ్యాయులు కొన్నిచోట్ల తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నట్లు సమాచారం.
90 శాతం కన్నా తక్కువైతే తాఖీదులు
ఉమ్మడి జిల్లాలో 2,804 పాఠశాలలు ఉండగా.. విద్యార్థులు సంఖ్య 2,54,093. జూన్ నెల చివరి ఆరు రోజుల (జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు) హాజరును పరిశీలిస్తే చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి పెద్దఎత్తున విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఒకవైపు విద్యాశాఖాధికారులు 90 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 శాతం కంటే తక్కువ మంది భోజనం చేసిన పాఠశాలలను అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని ఆయా పాఠశాలలకు తాఖీదులు ఇచ్చారు. ఆహారంలో నాణ్యత లేకపోవడం, తిన్న తర్వాత విద్యార్థులు ఇబ్బందిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఇళ్లకు రావాలని పిల్లలకు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరు ఇళ్ల నుంచే భోజనం తెచ్చుకుని పాఠశాలలో తింటున్నారు.
వైకాపా వారికే ఏజెన్సీల బాధ్యతలు
2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న ఏజెన్సీలను మార్చి తమ వర్గీయులకు బాధ్యతలు అప్పగించింది. ఈ ఏజెన్సీల నిర్వహణ సరిగ్గా లేకపోయినా ఐదేళ్ల పాటు వారినే కొనసాగించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్నిచోట్ల ఏజెన్సీల నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకొంటున్నారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలంలోని 80 శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల వారు స్వచ్ఛందంగా చాలించుకున్నారు. దీంతో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గదులు కూల్చారు.. చదువుకు గండం తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
పురుగుల అన్నం తినలేకున్నాం
[ 06-07-2024]
‘అన్నంలో పురుగులు, బొద్దింకలు ఉంటున్నాయి. వెంట్రుకలు వస్తున్నాయి. ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. -
గదులు కూల్చారు.. భావితరానికి చిక్కులు తెచ్చారు
[ 06-07-2024]
నాడు.. నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోంది.. రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైకాపా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. -
ఆక్రమణలకేసీ చూడండి
[ 06-07-2024]
రెండు లక్షల ఎకరాలకు సాగు.. వందలాది రైతు కుటుంబాల జీవనాధారమైన కేసీ కాల్వను వైకాపా నేతలు ఛిద్రం చేశారు.. కాల్వ వెంట ఉన్న ఖాళీ స్థలాలకు కబ్జా చేసి సాగునీటికి అడ్డుకట్ట వేశారు. -
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
[ 06-07-2024]
వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన, ఎరువుల, పురుగు మందుల విక్రయ దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
పేదింటి బిడ్డలు.. ప్రతిభలో శ్రీమంతులు
[ 06-07-2024]
వారంతా పేదింటి బిడ్డలు.. ప్రతిభలో మాత్రం శ్రీమంతులు. లక్ష్మీ కటాక్షం లేకపోవచ్చు.. సరస్వతి అనుగ్రహం మాత్రం పుష్కలం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. మరో వైపు హ్యాండ్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. -
శ్రీశైలంలో శిలపై శివలింగం గుర్తింపు
[ 06-07-2024]
శ్రీశైల మహాక్షేత్రంలోని రుద్రాక్షమఠం-సారంగధారమఠం మధ్య బండరాతి శిలపై చెక్కిన శివలింగాన్ని గుర్తించారు. అక్కడ రహదారి విస్తరణ, ప్రహరీ నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా గురువారం శివలింగం ఆకారాన్ని కనుగొన్నారు. -
మహానందిలో చిరుత సంచారం
[ 06-07-2024]
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిగ్రీలో ప్రవేశానికి వేళాయె!
[ 06-07-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పటికే ప్రకటన విడుదల కాగా, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్లైన్ పద్ధతిలోనే ప్రవేశాలు జరపనున్నారు. -
భక్తి పేరుతో భూముల స్వాహా
[ 06-07-2024]
మండల పరిధిలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఆలయంలో ఓ వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారు. -
విజయవాడ నుంచి త్వరలో విమాన సర్వీసులు
[ 06-07-2024]
విజయవాడ నుంచి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
[ 06-07-2024]
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడినప్పుడే సంపూర్ణ అభియాన్ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ రంజిత్బాషా, ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్, నీతీ ఆయోగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ స్మృతి సబర్వాల్, ఆర్డీవో రామలక్ష్మి తదితరులు అన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 06-07-2024]
జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ ఒక ప్రకటనలో కోరారు. -
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
[ 06-07-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్లో జరిగిన లా 3, 5వ ఏడాదికి సంబంధించి 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.