కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది.
ఆర్అండ్బీ అధికారుల ప్రయత్నాలు
ఐదేళ్లు వైకాపా ముఖ్య నేతలతో అంటకాగిన ఉన్నతాధికారులు తమ స్థానాలు పదిలపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖలో పనిచేస్తున్న పలువురు డీఈలు, ఏఈలు ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యారు. కీలకమైన పోస్టులను దక్కించుకునేందుకు కొందరు పోటీ పడుతుండగా.. ప్రస్తుతం ఉన్న స్థానాలను కాపాడుకునేందుకు మరికొందరు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. డోన్, కోవెలకుంట్ల డీఈలు గత ప్రభుత్వంలో చురుగ్గా వ్యవహరించారు. ప్రస్తుతం అదే పోస్టుల్లో ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆర్అండ్బీ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్కు చెందిన నలుగురు ఏఈలు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా పనిచేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కలిసి స్థానభ్రంశం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు.
కీలక స్థానం కోసం
ఉమ్మడి జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధి అండతో గత ఐదేళ్లలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇన్ఛార్జిగా కీలక స్థానంలో ఉండి ఆర్అండ్బీ పనులపై తనదైన ‘ముద్ర’ వేశారు. ప్రస్తుతం ఈ అధికారి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు.
నేషనల్ హైవే పదవులకు
నేషనల్ హైవేలో ఏడాది పొడవునా పనులు జరుగుతుంటాయి. ఆ విభాగంలో పోస్టింగ్ల కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆర్అండ్బీ ఏఈలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఏడు పోస్టులను దక్కించుకునేందుకు రెండు జిల్లాలకు చెందిన 11 మంది ఏఈలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలులో పోస్టింగ్ కోసం మరో ఆరుగురు ఏఈలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆ రెండు డీఈ స్థానాలకు పోటీ
జిల్లా కేంద్రం నంద్యాల డీఈ స్థానం కోసం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక అధికారితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది.
ఆత్మకూరులో ప్రస్తుతం డీఈగా పనిచేస్తున్న అధికారి స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఇప్పటికే ఇద్దరు ప్రజాప్రతినిధులను కలిశారు. డోన్ డీఈ పోస్టు కోసం ఇప్పటికే పలువురు అధికారులు ఓ ప్రజాప్రతినిధిని కలిశారు. కర్నూలు ఎస్ఈ పోస్టు కోసం జిల్లాకు చెందిన ఒక అధికారితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇళ్లు కాదు..ఊళ్లు అన్నారు.. రూ.98.31 కోట్లు ఊడ్చేశారు
[ 04-07-2024]
పశ్చిమ ప్రాంతంలో వలసలెక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్-3 కింద ఇళ్లు నిర్మించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించారు. ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లిస్తేనే నిర్మిస్తామని గుత్తేదారులు మెలిక పెట్టారు. -
వైద్య ‘కల’శాల
[ 04-07-2024]
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది. -
క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’
[ 04-07-2024]
నగరంలో క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
కర్నూలు-బళ్లారి మధ్య జాతీయ రహదారి నిర్మించాలి
[ 04-07-2024]
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాజ్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. -
ఉద్యోగుల కష్టార్జితాన్ని శిల్పా దోచుకున్నారు : బుడ్డా
[ 04-07-2024]
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
వినూత్న ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ
[ 04-07-2024]
బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్స్పైర్ మనక్’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. -
గూల్యం బ్యాడిగ విత్తనం అమూల్యం
[ 04-07-2024]
రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు. -
నాపై దాడి చేసేందుకు అక్రమార్కుల కుట్ర
[ 04-07-2024]
ఆదోని నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తాను అడ్డుకట్ట వేస్తుంటే.. జీర్ణించుకోలేని అక్రమార్కులు తనను హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. -
కూటమిలో కలిసేందుకు కసరత్తు
[ 04-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం