పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
దివ్యాంగుడికి పింఛన్లు అందజేస్తున్న మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
బనగానపల్లి, న్యూస్టుడే: పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే బనగానపల్లి పట్టణంలోని తెలుగుపేటలో ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. సుమారు రెండు గంటల పాటు కాలనీలో తిరిగి ప్రతి ఇంటికీ వెళ్లి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి నేరుగా పింఛన్లను అందజేశారు. నడవలేని వారి దగ్గకు వెళ్లి వారి ఇంటి మెట్లపైనే మంత్రి కూర్చొని పింఛన్లను అందించారు. అనంతరం పింఛనుదారులతో కలసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ గత రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ప్రజలు నమ్మి 2019లో 151 సీట్లు వైకాపాకు కట్టబెడితే కక్షపూరిత పాలన చేసి ప్రజలు ఛీకొట్టే స్థాయికి వెళ్లారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చేస్తారని, ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రోజు రూ.7 వేల పింఛన్ల మొత్తాన్ని అందించారని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా రూ.4వేలు ఇస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హిమాలయాలకు వెళ్తే ఇక్కడ ఉన్న మిగిలిన వైకాపా ఎమ్మెల్యేలు సంతోషంగా ఉంటారని, ఆయన హిమాలయాలకు వెళ్తే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే డీఎస్సీకి చర్యలు తీసుకుంటారని, అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబేనని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇళ్లు కాదు..ఊళ్లు అన్నారు.. రూ.98.31 కోట్లు ఊడ్చేశారు
[ 04-07-2024]
పశ్చిమ ప్రాంతంలో వలసలెక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్-3 కింద ఇళ్లు నిర్మించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించారు. ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లిస్తేనే నిర్మిస్తామని గుత్తేదారులు మెలిక పెట్టారు. -
వైద్య ‘కల’శాల
[ 04-07-2024]
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది. -
క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’
[ 04-07-2024]
నగరంలో క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
కర్నూలు-బళ్లారి మధ్య జాతీయ రహదారి నిర్మించాలి
[ 04-07-2024]
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాజ్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. -
ఉద్యోగుల కష్టార్జితాన్ని శిల్పా దోచుకున్నారు : బుడ్డా
[ 04-07-2024]
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
వినూత్న ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ
[ 04-07-2024]
బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్స్పైర్ మనక్’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. -
గూల్యం బ్యాడిగ విత్తనం అమూల్యం
[ 04-07-2024]
రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు. -
నాపై దాడి చేసేందుకు అక్రమార్కుల కుట్ర
[ 04-07-2024]
ఆదోని నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తాను అడ్డుకట్ట వేస్తుంటే.. జీర్ణించుకోలేని అక్రమార్కులు తనను హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. -
కూటమిలో కలిసేందుకు కసరత్తు
[ 04-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్