వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మకూరు, న్యూస్టుడే : వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట, నాగలూటి గూడెంలో సోమవారం ఆయన ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నారని చెప్పారు. స్వయంగా సీఎం లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తెదేపా గెలిస్తే పింఛన్లు తొలగిస్తారని దుష్ప్రచారం చేసిన వైకాపా నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పింఛన్లు పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరులు అడ్డంగా సంపాదించారని ఆరోపించారు. వర్ధన్ బ్యాంకు, శ్రీశైలం, మహానంది దేవస్థానాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటన్నింటినీ బయటకు తీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాదవర్మ, తెదేపా నాయకులు వేణుగోపాల్, కలీముల్లా, రఘుస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇళ్లు కాదు..ఊళ్లు అన్నారు.. రూ.98.31 కోట్లు ఊడ్చేశారు
[ 04-07-2024]
పశ్చిమ ప్రాంతంలో వలసలెక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్-3 కింద ఇళ్లు నిర్మించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు. ఆ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగించారు. ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలకు అదనంగా మరో రూ.35 వేలు చెల్లిస్తేనే నిర్మిస్తామని గుత్తేదారులు మెలిక పెట్టారు. -
వైద్య ‘కల’శాల
[ 04-07-2024]
గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ప్రతి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వైద్య కళాశాలలు మంజూరు చేశాం. రూ.వేల కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాం.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో చేతులెత్తేసింది. -
క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’
[ 04-07-2024]
నగరంలో క్లస్టర్ విశ్వ‘వివాదాలయం’గా మారింది. వర్సిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం నగరంలో క్లస్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
కర్నూలు-బళ్లారి మధ్య జాతీయ రహదారి నిర్మించాలి
[ 04-07-2024]
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాజ్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిశారు. -
ఉద్యోగుల కష్టార్జితాన్ని శిల్పా దోచుకున్నారు : బుడ్డా
[ 04-07-2024]
శ్రీశైల దేవస్థానంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టార్జితాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దోచుకున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు వెలుగు కార్యాలయంలో బుధవారం పొదుపు సంఘాల ఆర్పీలు, వెలుగు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
వినూత్న ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ
[ 04-07-2024]
బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్స్పైర్ మనక్’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. -
గూల్యం బ్యాడిగ విత్తనం అమూల్యం
[ 04-07-2024]
రైతులు సాగు చేసిన పంటలు మంచి దిగుబడి రావాలంటే ముందుగా నాణ్యమైనా విత్తనాలు అవసరం. వీటి కోసం రైతులు తిరగని చోటు ఉండదు.. ఒక చోట నాణ్యమైన విత్తనాలు లేకుంటే మరో చోటుకు వెళ్లి విచారణ చేసి మరి కొనుగోలు చేస్తారు. -
నాపై దాడి చేసేందుకు అక్రమార్కుల కుట్ర
[ 04-07-2024]
ఆదోని నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తాను అడ్డుకట్ట వేస్తుంటే.. జీర్ణించుకోలేని అక్రమార్కులు తనను హత్యచేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. -
కూటమిలో కలిసేందుకు కసరత్తు
[ 04-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ‘కూటమి’లో చేరడానికి ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా పాలనలో తమ వార్డులకు నిధులివ్వలేదు.. పార్టీ మార్పే శరణ్యమని కొందరు భావిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్