logo

వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా

వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 04:11 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే : వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని కొత్తపేట, నాగలూటి గూడెంలో సోమవారం ఆయన ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నారని చెప్పారు. స్వయంగా సీఎం లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తెదేపా గెలిస్తే పింఛన్లు తొలగిస్తారని దుష్ప్రచారం చేసిన వైకాపా నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పింఛన్లు పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరులు అడ్డంగా సంపాదించారని ఆరోపించారు. వర్ధన్‌ బ్యాంకు, శ్రీశైలం, మహానంది దేవస్థానాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటన్నింటినీ బయటకు తీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాదవర్మ, తెదేపా నాయకులు వేణుగోపాల్, కలీముల్లా, రఘుస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని