ఆనందం.. కనిపింఛన్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ఇంటింటికి పంపిణీ
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1వ తేదీన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛను అందించాలని రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క రోజులోనే వంద శాతం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది శనివారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛను మొత్తం రూ.4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బకాయిలు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందించనున్నారు.
ఉదయం 6 గంటలకే ప్రారంభం..
1వ తేదీ ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పింఛను నగదుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక పింఛను మొత్తం పెంచుతామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలుచేస్తుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడంతో అవ్వాతాతల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో మొత్తం 4.02 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వారిలో వృద్ధాప్య పింఛనుదారులే 2.41 లక్షల మంది ఉన్నారు.
పార్టీ శ్రేణులు పాల్గొనాలి
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కర్నూలు నగరంలో సోమవారం ఉదయం 5.40 గంటలకు సామాజిక పింఛను లబ్ధిదారులకు సొమ్ము పంపిణీ చేసేందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తనతోపాటు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నాయకులు, కార్యకర్తలు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టర్గా రాజకుమారి
[ 03-07-2024]
జిల్లా కలెక్టర్గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రను ఆదుకోవాలి
[ 03-07-2024]
అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్సభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ డా.బైరెడ్డి శబరి కోరారు -
సత్వర విచారణ..బాధితులకు రక్షణ
[ 03-07-2024]
పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి -
బాల మేధావులు.. బంగారు కొండలు
[ 03-07-2024]
చిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే. -
సాగు యంత్రం..వైకాపా కుతంత్రం
[ 03-07-2024]
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది -
ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం
[ 03-07-2024]
చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
154 ఏళ్ల తర్వాత.. నల్లమలలో అడవి దున్న అడుగులు
[ 03-07-2024]
జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి -
డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!
[ 03-07-2024]
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. -
బడి బువ్వ బాలేదు
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. -
వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు
[ 03-07-2024]
విద్యుత్తు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్