ఎన్నికల సామగ్రికి ఎసరు
ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు.
కంప్యూటర్, ఇతర వస్తువులు ఇంటికి తరలింపు
నంద్యాలలో ఓ రెవెన్యూ అధికారి చేతివాటం
నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వీటిని ఓ అధికారి గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటికి తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహరం ప్రస్తుతం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నంద్యాల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని హడావుడిగా సిద్ధం చేశారు. తహసీల్దారు కార్యాలయం కోసం చేపట్టిన నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎన్నికల సమయంలో దానిని పూర్తి చేసి ఆర్వో కార్యాలయం ఏర్పాటు చేశారు. నూతన భవనం కావడంతో అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. కంప్యూటర్లు, బల్లలు, ఏసీలతోపాటు వివిధ రకాల ఫర్నీచర్ తెప్పించారు. గత నెల 4వ తేదీన ఎన్నికల క్రతువు ముగిసిన కొద్దిరోజులకే నూతనంగా కొనుగోలు చేసిన ఫర్నీచర్పై సదరు అధికారి కన్నుపడింది. ఉన్నతాధికారులకు తెలియకుండానే సామగ్రిని ఇతర జిల్లాలోని తన నివాసానికి తరలించారు.
కక్కుర్తి పడి..
నంద్యాల ఆర్వో కార్యాలయానికి రూ.50 వేల విలువ చేసే కంప్యూటర్, రూ.35 వేలతో సోఫాసెట్, రూ.50 వేల విలువ చేసే ఏసీతో పాటు బల్లలు, కుర్చీలు కొనుగోలు చేశారు. పోస్టల్ బ్యాలట్ వినియోగంతో పాటు ఇతర అవసరాల కోసం నియోజకవర్గంలోని 286 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్టీల్ డబ్బాలను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. వీటన్నింటి విలువ రూ.లక్షల్లోనే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఆ సామగ్రి కార్యాలయం నుంచి మాయమైంది. నిబంధనల మేరకు వీటిని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోగానీ.. రెవెన్యూ కార్యాలయంలో వినియోగించాల్సి ఉంది. సదరు కక్కుర్తి అధికారి సుమారు రూ.5 లక్షల విలువైన వాటిని సొంతానికి తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ఓ ఏసీ ఉంది. దానిని కూడా మరో అధికారి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు కార్యాలయంలో ఉన్న మరికొన్ని కంప్యూటర్లను వివిధ ప్రాంతాలకు తరలించారని సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.లక్షలు వెచ్చించి ఫర్నీచర్, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో వాటిని కార్యాలయాల అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో పక్కదారి పట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టర్గా రాజకుమారి
[ 03-07-2024]
జిల్లా కలెక్టర్గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రను ఆదుకోవాలి
[ 03-07-2024]
అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్సభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ డా.బైరెడ్డి శబరి కోరారు -
సత్వర విచారణ..బాధితులకు రక్షణ
[ 03-07-2024]
పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి -
బాల మేధావులు.. బంగారు కొండలు
[ 03-07-2024]
చిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే. -
సాగు యంత్రం..వైకాపా కుతంత్రం
[ 03-07-2024]
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది -
ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం
[ 03-07-2024]
చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
154 ఏళ్ల తర్వాత.. నల్లమలలో అడవి దున్న అడుగులు
[ 03-07-2024]
జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి -
డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!
[ 03-07-2024]
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. -
బడి బువ్వ బాలేదు
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. -
వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు
[ 03-07-2024]
విద్యుత్తు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
కొత్త చట్టం కింద భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు