భవిత ప్రశ్నార్థకం
ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్ఎన్) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిజియోథెరపీ సేవలందని వైనం
ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు
డోన్పట్టణం, న్యూస్టుడే: ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్ఎన్) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిత కేంద్రాల్లో సెరిబ్రల్ పాల్సీ, మైల్డ్ మోడరేట్, ఆర్థోపెడికల్ ఇన్పైర్మెంట్, బహుళ వైకల్యం కలిగిన పలు కేటగిరీల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలతో పాటు ఐఈఆర్టీలతో ప్రతి ఏడాది శిక్షణ ఇప్పిస్తుంటారు. 2023-24 ఏడాదిలో మార్చి చివరి వరకు వారి సేవల్ని ఉపయోగించుకున్న ప్రభుత్వం తర్వాత విరామమిచ్చింది. 2024-25 ఏడాదిలో జూన్ 13న పాఠశాలలు, భవిత కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచే మళ్లీ పాత వారిని విధుల్లోకి తీసుకుని సేవలందేలా ప్రభుత్వం చూడాలి. కానీ నేటికీ వారి నియామకానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదలకాకపోవడంతో అంతా ఎదురుచూస్తున్నారు.
వేతనాల తగ్గింపు
తెదేపా ప్రభుత్వ హయాంలో భవిత కేంద్రాల్లో సీడబ్ల్యుఎస్ఎన్ పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు వైద్యులకు ఒక్కో శిబిరానికి గానూ రూ.1,250 వేతనం ఇవ్వగా... వైకాపా దీన్ని రూ.950లకు కుదించేసింది. ఆరోగ్యశాఖలో పలు విభాగాల వారికి వేతనాలు పెంచి ఇస్తుంటే..భవిత కేంద్రాల్లోని వారికి మాత్రం తగ్గించి ఇవ్వడం గమనార్హం. ప్రతి నెలా ఇవ్వకపోవడం మరీ దారుణమని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి రావడంతో తిరిగి తమకు వేతనాన్ని పెంచుతారనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తంచేస్తున్నారు.
తగిన చర్యలు తీసుకుంటాం
రఘురామిరెడ్డి, సీడబ్ల్యూఎస్ఎన్ జిల్లా సమన్వయకర్త, నంద్యాల
ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్యుల సేవలు అందేలా చూస్తాం. జిల్లా సర్వోన్నతాధికారి అనుమతికి నివేదించాం. ఈనెల 28 నుంచి నంద్యాలలోని కేంద్రాలకు వెళ్లాలని వైద్యులకు సమాచారం ఇచ్చాం. అన్ని మండల కేంద్రాల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం.
అంతా అరకొరే
- కర్నూలు జిల్లాలో 26 భవిత కేంద్రాలు ఉండగా తొమ్మిది మంది ఫిజియోథెరపిస్ట్లకు అయిదుగురు మాత్రమే పని చేస్తున్నారు. దాదాపు 12 మండలాల్లో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాల్లో 29 భవిత కేంద్రాలుండగా, పది మంది మాత్రమే సేవలందిస్తున్నారు.
- భవిత కేంద్రాల్లో సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాలో వైద్యుల చేతికి కాపీలందలేదని చెబుతున్నారు. పాఠశాలలు తెరిచి రెండు వారాలు అవుతున్నా...నేటికీ వైద్యులను విధుల్లోకి తీసుకోలేదు. అటు పిల్లలకు ఫిజియోథెరపీ వైద్య సేవలు అందక ఇబ్బందులుపడుతున్నారు.
- జిల్లా సర్వోన్నతాధికారుల అనుమతి కోసం వివరాలు పంపించినా...ఇంకా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని సీడబ్ల్యుఎస్ఎన్ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా సర్వోన్నతాధికారి మారడంతో అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటంతో పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టర్గా రాజకుమారి
[ 03-07-2024]
జిల్లా కలెక్టర్గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రను ఆదుకోవాలి
[ 03-07-2024]
అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్సభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ డా.బైరెడ్డి శబరి కోరారు -
సత్వర విచారణ..బాధితులకు రక్షణ
[ 03-07-2024]
పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి -
బాల మేధావులు.. బంగారు కొండలు
[ 03-07-2024]
చిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే. -
సాగు యంత్రం..వైకాపా కుతంత్రం
[ 03-07-2024]
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది -
ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం
[ 03-07-2024]
చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
నల్లమలలో అడవి దున్న అడుగులు
[ 03-07-2024]
జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి -
డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!
[ 03-07-2024]
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. -
బడి బువ్వ బాలేదు
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. -
వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు
[ 03-07-2024]
విద్యుత్తు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు.