logo

‘ఆ నలుగురు’స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

ఉపాధి కోసం వచ్చిన మహిళ అకస్మాత్తుగా మరణించిన ఘటన బేతంచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Published : 30 Jun 2024 12:49 IST

బేతంచర్ల: ఉపాధి కోసం వచ్చిన మహిళ అకస్మాత్తుగా మరణించిన ఘటన బేతంచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ నుంచి నేహాకుమారి (22) అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం బేతంచర్లకు వచ్చారు. ఆదివారం నేహాకుమారి ఆకస్మాత్తుగా మరణించింది. ఆమె మృతదేహాన్ని తిరిగి రాజస్థాన్‌కు తీసుకుపోలేని పరిస్థితులలో, ఆమె అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించవల్సిందిగా, పోలీసులను, ‘ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ’ వ్యవస్థాపక అధ్యక్షుడు వన్నూరు భాషాను మృతురాలి బంధువులు కోరారు.  వన్నూరు భాష మృతురాలి అంత్యక్రియలను స్థానిక బేతంచెర్ల స్మశాన వాటికలో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని