ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఇసుక, ప్రకృతి వనరుల్ని అనుమతులకు మించి తవ్వడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొట్టి తీవ్రంగా నష్టపరిచారని ఆయన మండిపడ్డారు. వీటన్నింటిపైనా అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలతో విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, గౌరు వెంకటరెడ్డిలతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన లాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానస్థితిలో ఉన్నాయని, ఎమ్మెల్యేల ద్వారా నివేదికలు తెప్పించుకుని డీపీఆర్ సిద్ధం చేసి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. గ్రామాల్లో వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులు నిర్మించలేదన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నాబార్డు ద్వారా వచ్చిన రూ.370 కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఆర్అండ్బీ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం గుత్తేదారులకు రూ.2,700 కోట్లు బకాయి పడిందన్నారు. తెదేపా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులపైన పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి ఫరూక్
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అదనపు ఎస్ఎస్.ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అదనపు పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.13 లక్షల 58 వేల కోట్ల అప్పులు తీర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డోన్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తెలిపారు. ఓర్వకల్లు దగ్గర ప్రాజెక్టు నిర్మించి తాగునీటి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
మంత్రులను కలిసిన కలెక్టర్, జేసీ
రాష్ట్ర మంత్రులు ఎన్ఎండీ.ఫరూక్, బీసీ జనార్దన్రెడ్డిలను ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, భార్గవ్రామ్ నాయుడు, గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమానాస్పద రీతిలో సచివాలయ ఉద్యోగిని మృతి
[ 02-07-2024]
నంద్యాల జిల్లా నూనెపల్లెలో సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. -
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నాయకులు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..’: గర్భవిచ్ఛిత్తి పోస్ట్పై మస్క్ వర్సెస్ కమలా హ్యారిస్!
-
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్కు అదిరిపోయే సీన్స్
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,150 ఎగువన నిఫ్టీ
-
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రూ.50 లక్షలు తీసుకుని మోసం
-
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
-
తమ్ముడు వైకాపా సర్పంచి.. అన్న తుళ్లూరు సీఐ