హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.
సమన్వయ లోపంతోనే ఇబ్బందులు
మంత్రి టీజీ భరత్
జలవనరులశాఖ ఇంజినీర్లతో సమీక్షిస్తున్న మంత్రి టీజీ భరత్
కర్నూలు జలమండలి, న్యూస్టుడే : కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో జలవనరులశాఖ అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. కేసీ కాలువలో కొంతవరకు గుర్రపుడెక్క తొలగించి మిగిలిన పనులు అలాగే వదిలేశారని, ఫలితంగా దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. జలవనరులు, నగరపాలక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీ నదిలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశలవారీగా ఆక్రమణలు తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నగర ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో ఎస్ఎస్ ట్యాంకు ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నగర ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు తదితర అంశాలపై ఇంజినీర్లతో చర్చించారు. ఈ సమావేశంలో కర్నూలు సీఈ కబీర్బాషా, ఎస్ఈ రెడ్డి శేఖర్రెడ్డి, కేసీసీ ఈఈ తిరుమలేశ్రెడ్డి, ఎల్లెల్సీ ఈఈ శైలేశ్వర్, డీఈఈలు రామకృష్ణ, జిలానీ, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
కర్నూలు విద్య, న్యూస్టుడే: నగరానికి దూరంగా ఉన్న మైనారిటీ విద్యార్థుల వసతిగృహాన్ని నగరంలో ఏర్పాటుచేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా విద్యాశాఖాధికారి శామ్యుల్ ఆధ్వర్యంలో సమగ్రశిక్షా అధికారులతో మంత్రి సమీక్షించారు. కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికర భోజనం వడ్డించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి అవసరం
కల్లూరు గ్రామీణ, కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్టుడే : నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో టిడ్కో, నగరపాలక ప్రజారోగ్య విభాగ అధికారులతో శనివారం సమీక్షించారు. కాలువల శుభ్రత, చెత్త సేకరణ, తరలింపుపై చర్చించారు. హైపో ద్రావణం ఉచితంగా అందిస్తామని.. వీధుల్లో పిచికారీ చేయించాలని ఆదేశించారు. జగన్నాథగట్టుపై 10 వేల గృహాలు మంజూరయ్యాయని, ఈ ఇళ్ల కోసం అర్హులైనవారి వివరాలను వార్డులవారీగా జాబితా సిద్ధం చేయాలన్నారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, నగరపాలక ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరెడ్డి, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం