వైకాపా సహకార బ్యాంకు
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు.
వారు చెప్పినవారికే రుణాలు
తిరిగి చెల్లించని వైనం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు.. వారికి అప్పటి అధికార అండదండలు ఉండటంతో తిరిగి చెల్లించలేదు.. ఫలితంగా లాభాల బాట వీడి నష్టాల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదాన్ని తెచ్చి పెట్టారు.. వైకాపా ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థ నిర్వీర్యమైంది. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయింది. త్రిసభ్య కమిటీలు, కొందరు అధికారులు కుమ్మక్కై సహకార రుణాలు మింగేశారు. సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు విప్పుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
గోదాముల గుట్టు విప్పాలి
ఉమ్మడి జిల్లాలో 290 గోదాముల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 500 మెట్రిక్ టన్నుల గోదామును రూ.45 లక్షలు, వెయ్యి మె.ట. గోదామును రూ.90 లక్షలతో నిర్మిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అనుచరులకు ఒకరిద్దరికే అప్పగించారు. ఒక్కో సంఘం పరిధిలో రెండు నుంచి మూడు గోదాముల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ నాసిరకంగా ఉన్నాయని, గ్రామానికి, ప్రాథమిక సహకార సంఘానికి సుదూర ప్రాంతంలో నిర్మించడంతో ఒక్కటీ వినియోగంలోకి రాలేదు.
బోగస్ పట్టాలు పుట్టించి
కృష్ణగిరి ప్రాథమిక సహకార సంఘం అక్రమాలకు చిరునామాగా మారింది. సంఘం పరిధిలో 2,500 మంది సభ్యులున్నారు. వైకాపా నేత కనుసన్నల్లోనే అక్రమాల పర్వం కొనసాగింది. సదరు నేత అక్రమార్కులతో కలిసి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు పుట్టించారు. నకిలీ ఈ-పాసు పుస్తకాలతో కృష్ణగిరి సొసైటీ నుంచి 15 మంది పేర్లతో రూ.40 లక్షల రుణాలు తీసుకున్నారు.
ఐదేళ్లుగా నేతల గుప్పిట
ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 1.20 లక్షల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. దాని పరిధిలో 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో నాన్ అఫీషియల్ త్రిసభ్య కమిటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లకు సెవెన్మెన్ కమిటీలు ఏర్పాటు చేసింది. వాటి గడువు ప్రతి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చింది. సంఘాలు వైకాపా నేతల గుప్పిట్లో ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలకు విరివిగా రుణాలు ఇచ్చేశారు.
రూ.190 కోట్ల మొండి బకాయిలు
బ్యాంకులో సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా నిబంధనలు తుంగలో తొక్కారు. తమ అనుయాయులకే రుణాలు ఇప్పించారు. తిరిగి చెల్లింపుల్లో వారు మొండికేశారు. గతేడాది నాటికి రూ.120 కోట్ల వరకు మొండి బకాయిలు ఉండగా.. ప్రస్తుతం రూ.190 కోట్లకు చేరింది. రుణ రికవరీలపై పాలకవర్గాలు దృష్టి పెట్టించాల్సి ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. రుణాలు పొందిన వారంతా తమవారేనని.. వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని.. వారి వద్ద ఉన్నప్పుడు రుణ చెల్లింపులు చేస్తారంటూ త్రిసభ్య, సెవెన్మెన్ కమిటీలు అధికారులకు సుతిమెత్తగా సూచించడం గమనార్హం. దీంతో లాభాల బాటలో ఉన్న సహకార బ్యాంకు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జేఎల్జీ గ్రూప్ల పేరుతో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు తమ అనుచరులకు ఇచ్చేందుకు బ్యాంకు ఛైర్పర్సన్ ప్రయత్నించారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో ప్రక్రియ ఆగిపోయింది.
కమీషన్ల కక్కుర్తి
వైకాపా ఐదేళ్ల పాలనలో పీఏసీఎస్లు త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ (సెవెన్మెన్ కమిటీలు), పాలకవర్గాలు అన్నదాతల నుంచి ముక్కుపిండి కమీషన్లు వసూలు చేశాయి. రూ.లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముడుపులు ఇచ్చినవారికే రుణాల మంజూరుకు సహకార పాలకవర్గాలు సిఫారసు చేశాయి. ఏటా రెండు సీజన్లలో పంట రుణాలతోపాటు దీర్ఘకాలిక, వివిధ రకాల రుణాలు సుమారు రూ.వంద కోట్లకు పైగా సహకార బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తారు. ఆయా పాలకవర్గాల డైరెక్టర్లు, సొసైటీల అధ్యక్షులు తమ సహకార సంఘాలకు రూ.కోటి వరకు రుణ కేటాయింపులు చేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.