రేపే పింఛను పండగ
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు,
ఇంటి వద్దే ఇవ్వనున్న అధికారులు
అవ్వాతాతల్లో ఆనందం
పింఛనుదారులకు ధ్రువపత్రం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. రూ.4 వేలు పింఛను ఇస్తామని చెప్పిన ఆయన ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులై 1న ఒక్కో పింఛనుదారుడికి రూ.7 వేలు అందించేలా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు దివ్యాంగులు, పూర్తి వైకల్యం కలిగినవారు, పెరాలసిస్ బాధితులు తదితరులకు మేలు జరగనుంది. పింఛను మొత్తం పెంచడంతో పింఛనుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటివద్దే జులై 1న పింఛన్లు ఇవ్వనున్నారు. మొదటి రోజే వంద శాతం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
వీరికి ఎంతో మేలు
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులకు ప్రతి నెలా పింఛను మొత్తం రూ.15 వేలను ఎన్డీయే ప్రభుత్వం అందించనుంది. బోదకాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి, డయాలసిస్ రోగులు తదితరులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, అవ్వాతాతలకు రూ.4 వేలు పంపిణీ చేయనున్నారు.
పింఛనుదారులకు ఓ ధ్రువపత్రం ఇవ్వనున్నారు. అందులో పింఛను సొమ్ము అందినట్లు.. పింఛను సొమ్ము ఎవరు పంపిణీ చేశారో ఆ అధికారి సంతకం ఉంటుంది. పింఛనుదారులు పింఛను తీసుకున్నట్లు రసీదు సైతం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. మొదటి రోజే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఏవైనా సాంకేతిక.. ఇతరత్రా సమస్యలు తలెత్తితే మరుసటి అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే వంద శాతం పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం నాటికే పింఛను సొమ్మును సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి తీసుకున్నారు.
4,66,469 మందికి లబ్ధి
వైకాపా ప్రభుత్వం మొత్తం 16 రకాల పింఛన్లు పంపిణీ చేయగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ పింఛన్లను 28 కేటగిరీలుగా విభజించింది. సామాజిక భద్రత పింఛన్లతోపాటు దివ్యాంగులు, మూత్రపిండాలు, తలసేమియా, ఇతర బాధితులను కేటగిరీలుగా విభజించారు. ఉమ్మడి జిల్లాలో 11 రకాల సామాజిక పింఛనుదారులకు ప్రతి నెలా రూ.4 వేలు అందించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,66,469 మంది పింఛనుదారులు ఉన్నారు. వైకాపా హయాంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే జూన్లో రూ.150 కోట్ల మేర పింఛను సొమ్ము పంపిణీ చేశారు. జులై నెలలో ఎన్డీయే ప్రభుత్వం రూ.317.57 కోట్లు పంపిణీ చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.