మాన్యం భూముల మేతలు
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు
ఐదేళ్లుగా వైకాపా నేతలకు నైవేద్యం
ఆదాయం తక్కువ చూపుతూ అరాచకం
నంద్యాల పట్టణం, పాణ్యం, న్యూస్టుడే: ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు. ‘సీ’ విభాగానికి సంబంధించి ఆలయ మాన్యం భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వాటికి బహిరంగ వేలాలు నిర్వహించకుండా ‘గుత్తా’ధిపత్యం సాగిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. కొందరు నేతలు అధికారులను మచ్చిక చేసుకొని ఆన్లైన్లో పేర్లు చేర్చి పట్టాదారు పుస్తకాలు పొందారు. ఆలయ భూముల అక్రమాలపై క్షేత్ర స్థాయిలో విచారించి వేలం పాటలు నిర్వహిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.
భయపెట్టి దారికి తెచ్చుకున్నారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,350 ఆలయాలు ఉన్నాయి. ఇందులో హుండీ ఆదాయం రూ.25 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆలయాలు 5 (‘ఏ’ కేటగిరి) ఉండగా, రూ.25 లక్షల్లోపు ఆదాయం వచ్చేవి 66 (‘బీ’ విభాగం) వరకు ఉన్నాయి. రూ.5 లక్షల్లోపు ఆదాయం వచ్చే ఆలయాలను ‘సీ’ కేటగిరి పరిధిలో చేర్చారు. ఈ విభాగంలో కర్నూలులో 2,153, నంద్యాలలో 2,126 వరకు ఉన్నాయి. ఆయా ఆలయాల మాన్యం భూములు అర్చకుల పర్యవేక్షణలోనే ఉన్నాయి. వారే కౌలుకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయంతో ఆలయాల్లో ధూపదీప, నైవేద్యాలు, సిబ్బంది వేతనాల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఆయా ఆలయాల పరిధిలో వైకాపా నేతలు అర్చకులను భయపెట్టి తక్కువ ధరకు పొలాలు సొంతం చేసుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,350 ఆలయాల పరిధిలో 65,203 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు కొన్ని ఆలయ భూములకు ఏడాదికోసారి, మరికొన్నింటికి మూడేళ్లకోసారి బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంటుంది. మాన్యం భూములు కౌలుకు ఇవ్వడంతో దేవాదాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఏటా రూ.8 కోట్లు, నంద్యాలలో రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది నంద్యాల జిల్లాలో 250 ఆలయాలకు సంబంధించి 9 వేల ఎకరాల భూములు, కర్నూలులో 345 ఆలయాలకు సంబంధించి 7 వేల ఎకరాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వేలాలు నిర్వహిస్తే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశముంది. గత ఐదేళ్లుగా వైకాపా నేతలు చెప్పిన వారికి తక్కువ ధరకు అంటగట్టారు.
తప్పుడు లెక్కలతో ఆదాయానికి గండి
కర్నూలు జిల్లా పరిధిలోని 1,856 దేవాలయాల పరిధిలో 43,455 ఎకరాలు ఉండగా ఇందులో అర్చకులు, భజంత్రీ, పల్లకీ సేవకుల పరిధిలో 33,300 ఎకరాలున్నాయి. మిగిలిన భూములు సర్వీస్ ఇనాంగా ఉన్నాయి. 7,600 ఎకరాలకు ఏటా రూ.1.92 కోట్లు కౌలు రూపంలో వస్తుంది. నంద్యాల జిల్లా పరిధిలో 2,494 ఆలయాలు ఉండగా మాన్యం భూమి 48,378 ఎకరాలు ఉంది. ఇందులో 19,800 ఎకరాలు అర్చకులు, ఇతరుల చేతుల్లో.. 1,350 ఎకరాలు సర్వీసు ఇనాంగా ఉన్నాయి. ఏటా రూ.8.35 కోట్ల కౌలు వస్తోంది. గతంతో పోలిస్తే మాన్యం భూముల కౌలు ధరలు ఎకరానికి మూడింతలు పెరిగాయి. నీటి పారుదల సౌకర్యాలు పెరగడంతో భూములకు డిమాండు వచ్చింది. వైకాపా నాయకులు జోక్యం చేసుకొని బహిరంగ విపణిలోని కౌలు కన్నా తక్కువకే దక్కించుకొని దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొట్టారు.
ఐదేళ్లుగా వేలానికి అడ్డంకులు
పాణ్యం మండలం గగ్గటూరులోని ఈశ్వర భోగలింగేశ్వర స్వామి ఆలయ మాన్యానికి చివరగా 2007లో బహిరంగ వేలం నిర్వహించారు. దీనికి 31.02 ఎకరాల మాన్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కౌలు ధర ఎకరానికి రూ.30 వేలకుపైగా ఉంది. కొన్నేళ్ల కిందట ఈ మాన్యం భూములకు వేలం నిర్వహించాలని ప్రయత్నించగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. రూ.10 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సరే.. ఐదేళ్ల నుంచి వేలం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
తక్కువకు దక్కించుకొని...
కౌలు భూముల వేలం పాటలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కౌలు మొత్తం రూ.25 కోట్ల లోపు ఉంది. 10 ఏళ్ల కిందటే సర్వీసు ఇనాం భూముల కౌలు ఏటా రూ.1.92 కోట్లుగా, అర్చకులు, భజంత్రీలు, పల్లకీ సేవకులు ఇచ్చే కౌలు రూ.3 కోట్లు ఉంది. ఈ లెక్కలు పదేళ్లుగా అటుఇటుగా ఉన్నాయి. రెండు కార్లు పంటలు పండే మహానంది క్షేత్ర భూములకు కౌలు బహిరంగ విపణిలో ఎకరం రూ.70 వేలకుపైగా ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న కౌలుదారులు ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారు. వాటిని ఇతరులకు రూ.70 వేల చొప్పున ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగుగంగ కాల్వ కింద ఉన్న బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు, బి.కోడూరు, మహానంది మండలం అల్లినగరం, శ్రీనగరం, రుద్రవరం మండలం బీరవోలు, రుద్రవరం, డి.కొట్టాల ప్రాంతాల్లోని పలు ఆలయాల భూముల కౌలు కూడా నామమాత్రంగానే చెల్లించి ఇతరులకు ఎకరానికి రూ.30 వేల వరకు ఇస్తున్నారు.
రూ.60 కోట్ల విలువైన భూమిపై కన్ను
కల్లూరు మండలం సల్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం పేరిట 15.01 ఎకరాల పొలం ఉంది. ఇది ఏళ్లుగా దేవుని మాన్యం. సర్వే నంబరు 71లోని ఈ భూమి రెవెన్యూ దస్త్రాల్లో చెన్నకేశవ స్వామి పేరు మీద ఉంది. ఆలయంలో ధూపదీప నైవేద్యం పెట్టే పూజార్ల పేర్లు కొన్ని తరాలుగా చెన్నకేశవ స్వామి. రెండు పేర్లు ఒకటే కావడంతో ఇదే అవకాశంగా కొందరు అప్పటి అధికార పార్టీ వైకాపా నేతలు పాసు పుస్తకాలు సృష్టించారు. ఆ పార్టీకి చెందిన ఓ ‘పెద్దాయన’ అండతోనే ఆక్రమణలకు పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీని విలువ ప్రస్తుతం రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
దేవుడి మాన్యాన్నీ తవ్వేశారు
ఓర్వకల్లు మండలంలోని శకునాలలో 155, 163 సర్వే నంబర్లలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి 18 ఎకరాల మాన్యం భూమి ఉంది. పూజారులు ఆయా భూములు అనుభవిస్తూ ఆలయ నిర్వహణ చేపట్టాల్సి ఉంది. గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో ఆలయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైకాపా నేతలు ఆయా భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వేసి ఎందుకూ పనికి రాకుండా చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారు.
మఠం భూములు హాంఫట్
చిప్పగిరి భోగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను ఆక్రమించుకుని విక్రయించిన ఒకరు రాజకీయ నేతగా మారారు. ఆలూరులో గని మఠం భూములు, ఆస్పరి మండలం శంకరబండ గ్రామంలో మాధవస్వామి ఆలయానికి చెందిన భూములు 10 ఎకరాలు తన అధీనంలో ఉంచుకున్న నాయకుడు ఒకరు కౌలు మాత్రం చెల్లించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం