నాడితప్పిన నిర్వహణ
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు
సర్వజన ఆసుపత్రిలో రోగుల అవస్థ
మంత్రి టీజీ భరత్ ఆకస్మిక తనిఖీ
నీళ్లు నమిలిన పర్యవేక్షకుడు
ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే : సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు.. రోగులకు కనీసం స్వచ్ఛమైన నీరు అందించలేకపోతున్నారు.. ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం ఆయన సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు బాధితులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రికి విన్నవించి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను మంత్రి తనిఖీ చేసిన సమయంలో కొన్నిచోట్ల విద్యుత్తు లేకపోవడంపై ఎలక్ట్రికల్ ఏఈ, ఏపీఎంఎస్ఐడీసీ సీఈ, విద్యుత్తు శాఖ ఎస్ఈ ఉమాపతిని పిలిపించి మాట్లాడారు. సమస్యను ఎన్ని రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తారనే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గోడు వినిపించిన రోగులు
- ఆసుపత్రిలో ఎక్స్రే విభాగం వద్దకు మంత్రి టీజీ భరత్ వెళ్లినప్పుడు ఓ బాధితురాలు తన గోడు వినిపించారు. తనను మూడు రోజుల నుంచి తిప్పుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.ప్రభాకర్రెడ్డిని మంత్రి ప్రశ్నించగా యు.పి.ఎస్.లు మరమ్మతులకు గురయ్యాయని సమాధానమిచ్చారు. గత కొద్దిరోజులుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అంగీకరించారు.
- సీటీ స్కాన్ విభాగాన్ని పరిశీలించగా కేవలం ఐదుగురికి మాత్రమే స్కానింగ్ తీసి మిగతావారిని పంపేస్తున్నారని కొందరు విన్నవించారు. అదేమి లేదంటూ పరిస్థితి తీవ్రతను తగ్గించేలా ఆసుపత్రి పర్యవేక్షకుడు ప్రయత్నించారు. దస్త్రాలను మంత్రి పరిశీలించగా గత పది రోజులుగా ఐదుగురికి మించి సీటీ స్కాన్ చేయడం లేదని తేలడంతో డా.ప్రభాకర్రెడ్డి నీళ్లు నమిలారు.
- తుంటి ఎముక అరిగిపోవడంతో చికిత్స కోసం గుత్తి నుంచి సర్వజన ఆసుపత్రికి వస్తే స్కానింగ్ ఫిల్ముల కోసం రూ.750 చెల్లించమంటున్నారని కృష్ణవేణి అనే బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గుత్తి నుంచి కర్నూలు వస్తే ఇక్కడ కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం
- వైద్య పరీక్షల విభాగం వద్ద రోగులు కూర్చునేందుకు కుర్చీలూ లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో టీజీ వెంకటేశ్ ఏర్పాటుచేయించిన ఆర్.ఒ. ప్లాంట్లు నిరుపయోగంగా ఉండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేస్తే కనీసం నిర్వహణ పట్టించుకోరా అని సూపరింటెండెంటు డా.ప్రభాకర్రెడ్డిని నిలదీశారు.
- పీడియాట్రిక్ ఐసీయూలో ఏసీలు లేక పిల్లలు ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రి అధికారులను మంత్రి ప్రశ్నించారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మరమ్మతులు చేయించకుండా అలానే వదిలేశారు. కొద్దిరోజుల నుంచి పనిచేయడంలేదంటూ మంత్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం గమనార్హం.
- ఆసుపత్రిలో దుర్గంధం వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తించారు. ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఎలా అని అధికారులను మంత్రి నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్