కేసీ.. వ్యర్థాలతో నిండి
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు.
హంద్రీలో ఆక్రమణలు
చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులే
నేడు జలవనరులశాఖ అధికారులతో మంత్రి భరత్ సమీక్ష
కేసీ కాలువలో పెరిగిన గుర్రపుడెక్క
కర్నూలు జలమండలి, న్యూస్టుడే : నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. మరోవైపు కేసీ కాలువ దుర్గంధంతో నిండిపోయింది. అయినా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమే. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీజీ భరత్ వివిధ ప్రభుత్వం శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తుంగభద్ర, హంద్రీ నదులతోపాటు కేసీ కాలువపైనా సమీక్షించాల్సిన అవసరం ఉంది.
- నగరం మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రవహించే కేసీ కాలువ డంపింగ్ యార్డును తలపిస్తోంది. కాల్వలో గుర్రపుడెక్క పెద్దఎత్తున పెరిగినా అటు నగరపాలక, ఇటు జలవనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి భరత్ కేసీపై సమీక్షించి పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
- నగరంలో హంద్రీనది పెద్దఎత్తున ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా కనీసం తాఖీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. కల్లూరు నుంచి జొహరాపురం వరకు విస్తరించిన హంద్రీ నది ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. హంద్రీ నదికి హద్దులు ఏర్పాటుచేసి ఆక్రమణలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.
నిర్వహణ నిధులేవీ?
కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వేలాది మంది రైతులు తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)పై ఆధారపడి జీవిస్తున్నారు. దీని పరిధిలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర జలాశయం నుంచి మన నీటి వాటా సక్రమంగా విడుదల చేస్తే రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశముంటుంది. సుంకేసుల జలాశయం బాగోగులు, నిర్వహణకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
[ 01-07-2024]
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. -
నిర్లక్ష్యం విత్తుకుంది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.30 లక్షల హెక్టార్లు కాగా అందులో పత్తి 2.70 లక్షల హెక్టార్లు, మిర్చి 50 వేల హెక్టార్లకుపైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. -
ఆనందం.. కనిపింఛన్
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఎన్నికల సామగ్రికి ఎసరు
[ 01-07-2024]
ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు. -
నాటు ఘాటెక్కింది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు సారా ఘాటెక్కింది. వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారుచేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయలేక చేతులెత్తేశారు. -
భవిత ప్రశ్నార్థకం
[ 01-07-2024]
ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్ఎన్) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాహం తీరాలంటే.. సరిహద్దు దాటాల్సిందే
[ 01-07-2024]
వేసవిలో ఏటా తాగునీటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. కానీ వర్షాకాలం మొదలైనా.. పల్లెలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ ప్రాంతంలో గుక్కెడు నీటి కోసం గ్రామీణులు అల్లాడుతున్నారు. -
హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం
[ 01-07-2024]
ప్రజాగళం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను తెదేపా ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు