భీమన్న.. నీ నటన భేషన్న
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన..
పాఠాలపైనే కాదు.. పద్యాలపైనా పట్టు
పురస్కారాలు, ప్రశంసలు ఆయన సొంతం
హాస్య నటిగా..
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. నాటక రంగంలో మాత్రం విశేష ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఒకటి, రెండు కాదు ఏకంగా రెండువేల నాటకాలు ప్రదర్శించి, అద్భుత ప్రతిభ కనబరచి, కర్ణాటక ప్రభుత్వం, పలు సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినా కర్ణాటకలో తన కీర్తిని చాటారు. ఆయనే ఆదోని మండలం మండిగిరి పంచాయతీ తిరుమలనగర్కు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు భీమన్న.
తాత, తండ్రి అడుగు జాడలో..
ఆదోని డివిజన్ పరిధిలోని కౌతాళం మండలం బదినేహళ్ గ్రామానికి చెందిన సుళేకేరి వెంకోబన్న, కె.లక్ష్మమ్మ దంపతుల కుమారుడు భీమన్న. ప్రస్తుతం ఆదోని మండలం మండిగిరిలో స్థిరపడ్డారు. 1983లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, 34 ఏళ్ల పాటు బోధన సాగించారు. 2017లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. తండ్రి వెంకోబన్న, తాత ఈరన్న స్ఫూర్తితో నాటక రంగంలో పట్టు సాధించారు. 1980 నుంచి ఇప్పటి వరకు 2వేల నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సామాజిక, పౌరణిక నాటకాలు ప్రదర్శించారు. 1980లో వరనోడి హెణ్ణు కొడు(పిల్లవాడిని చూసి, పిల్లను ఇవ్వు) అనే కన్నడ నాటకంతో అరంగేట్రం చేశారు. రక్తరాత్రి, గౌరి గెద్దళు, గౌడరు గద్దలు, ప్రాణ వోదరు, మానబేకు, సర్పరాజా, హేమారెడ్డి మల్లమ్మ, తెలుగులో అల్లురిసీతారామరాజు, దుర్యోధనుడు, నారదుడు, మోహిని భస్మాసురుడు, తదితర నాటకాలు ప్రదర్శించారు. ఇటీవల ఐదు రోజుల కిందట గత్తిన అత్తె, గమ్మత్తిన సొసె అనే కన్నడ నాటకంలో అత్తా రుద్రమ్మ పాత్రలో కనిపించారు. అదేవిధంగా పురంధర దాసరు, విజయదాసరు, ఈశ్వరుడు తదితర పాత్రలు వేసి ఆకట్టుకున్నారు. బెంగళూరు, రాయచూరు, బళ్లారి, ఉడిపి, మంత్రాలయం, ఆదోని, కౌతాళం తదితర ప్రాంతాల్లో 43 ఏళ్లుగా నాటకాలు వేస్తూనే ఉన్నారు. వీటితో పాటు కన్నడ సీరియల్ దాసనాగు విశేష నాగులో పురంధర దాసు శిష్యుని పాత్ర చేశారు. రెండు టెలీఫిలిమ్స్లో నటించారు.
పలు అవార్డులు సొంతం
2021లో బెంగళూరులో కర్ణాటక మంత్రి శ్రీరాములు చేతుల మీదుగా ఉత్తమ నాటక అవార్డు అందుకున్నారు. కర్ణాటక నాటక అకాడమి, గడినాడు రంగ ప్రశస్తి ఆధ్వర్యంలో నాటక రంగ అవార్డు దక్కించుకున్నారు. 2019లో బళ్లారి రాఘవ ప్రసస్థి సంస్థ వారు ఉత్తమ కళాకారుడు అవార్డు పొందారు. ఉడిపి పీఠాధిపతులు, గదగ పుట్టరాజ గవాయ్ నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా చేసిన సేవలకు గుర్తింపుగా 2008లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కలెక్టర్ నుంచి అందుకున్నారు.
నాటకం రంగం అంటే ప్రాణం
భీమన్న, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
చిన్నప్పటి నుంచి నాటకం రంగం అంటే ప్రాణం. మా తండ్రి వెంకోబన్న, తాత ఈరన్న నాటకాలు వేసేవారు. వారి స్ఫూర్తితో నేను వాటిని అందిపుచ్చుకున్నాను. గతంలో నెలకు రెండు, మూడు నాటకాల్లో పాత్రాలు పోషించేవాణ్ని, ప్రస్తుతం సమమం దొరికితే చాలు నాటకాలు వేస్తున్నాను. సమాజాన్ని చైతన్యపచడంలో నాటకాలు కీలకమనే విషయం గుర్తించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
[ 01-07-2024]
మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి 84 జన్మదినం సోమవారం అభిమానులు సంబరాలు చేసుకున్నారు. -
ఏపీలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
ఏపీలో పింఛనుదారులు పండగ చేసుకుంటున్నారని జడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నారు. -
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
[ 01-07-2024]
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ మొరాయించింది. ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ వెబ్సైట్ పనిచేయడం లేదు. -
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
[ 01-07-2024]
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. -
నిర్లక్ష్యం విత్తుకుంది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.30 లక్షల హెక్టార్లు కాగా అందులో పత్తి 2.70 లక్షల హెక్టార్లు, మిర్చి 50 వేల హెక్టార్లకుపైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. -
ఆనందం.. కనిపింఛన్
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఎన్నికల సామగ్రికి ఎసరు
[ 01-07-2024]
ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు. -
నాటు ఘాటెక్కింది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు సారా ఘాటెక్కింది. వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారుచేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయలేక చేతులెత్తేశారు. -
భవిత ప్రశ్నార్థకం
[ 01-07-2024]
ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్ఎన్) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాహం తీరాలంటే.. సరిహద్దు దాటాల్సిందే
[ 01-07-2024]
వేసవిలో ఏటా తాగునీటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. కానీ వర్షాకాలం మొదలైనా.. పల్లెలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ ప్రాంతంలో గుక్కెడు నీటి కోసం గ్రామీణులు అల్లాడుతున్నారు. -
హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం
[ 01-07-2024]
ప్రజాగళం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను తెదేపా ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు వార్నింగ్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి