గిరిజనంలో రక్తహీనత
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నంద్యాల పాతపట్టణం, న్యూస్టుడే: ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. వారికి ఉచితంగా వైద్యసేవలు అందించనున్నారు. బాధితులకు పింఛన్లూ పంపిణీ చేయనున్నారు. 2047 నాటికి సికిల్సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 10 వేల కిట్లతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 40 ఏళ్ల లోపు వారికి పరీక్షలు నిర్వహించారు. వారితో పాటు మారుమూల గ్రామాల్లో ఉండే గిరిజనులను పరీక్షించేందుకు మరో 40వేల కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో 50వేల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 32వేల మందికి పూర్తి చేశారు. ఇందులో 11 అనుమానిత కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. వారికి మళ్లీ వైద్యులు పరీక్షించి వ్యాధి నిర్థారణ చేయనున్నారు. వ్యాధి నిర్థారణ అయిన తర్వాత ఆ రోగికి ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తారు. ఖర్చులకు గానూ నెలకు రూ.15 వేల పింఛను ప్రతినెలా అందజేస్తారు. జులై 3 వరకు వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారని తెలిపారు.
11 మందికి సికిల్ సెల్ ఎనీమియా
డా.వెంకటరమణ, డీఎంఅండ్హెచ్వో, నంద్యాల
రక్త కణాలు తక్కువగా ఉండటంతో పాటు వారిలో కణాలు ఉత్పత్తి కాని పరిస్థితి నెలకొనడంతో గిరిజనులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకపోయినప్పటికి వారి తల్లిదండ్రుల జన్యువు నుంచి సంక్రమిస్తుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
[ 01-07-2024]
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. -
నిర్లక్ష్యం విత్తుకుంది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.30 లక్షల హెక్టార్లు కాగా అందులో పత్తి 2.70 లక్షల హెక్టార్లు, మిర్చి 50 వేల హెక్టార్లకుపైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. -
ఆనందం.. కనిపింఛన్
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఎన్నికల సామగ్రికి ఎసరు
[ 01-07-2024]
ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు. -
నాటు ఘాటెక్కింది
[ 01-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు సారా ఘాటెక్కింది. వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారుచేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయలేక చేతులెత్తేశారు. -
భవిత ప్రశ్నార్థకం
[ 01-07-2024]
ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్ఎన్) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దాహం తీరాలంటే.. సరిహద్దు దాటాల్సిందే
[ 01-07-2024]
వేసవిలో ఏటా తాగునీటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. కానీ వర్షాకాలం మొదలైనా.. పల్లెలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ ప్రాంతంలో గుక్కెడు నీటి కోసం గ్రామీణులు అల్లాడుతున్నారు. -
హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం
[ 01-07-2024]
ప్రజాగళం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను తెదేపా ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి