సాగునిధి ప్రణాళిక
వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ జలాశయాల నిర్వహణను ‘నీరు’గార్చారు. గేట్ల వద్ద రబ్బరు సీళ్లు వేయలేదు.. గ్రీజు పూయలేదు.. తాళ్లు బిగించలేదు.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి
నివేదిక కోరిన ప్రభుత్వం
నంద్యాల పట్టణం, కర్నూలు జలమండలి న్యూస్టుడే : వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ జలాశయాల నిర్వహణను ‘నీరు’గార్చారు. గేట్ల వద్ద రబ్బరు సీళ్లు వేయలేదు.. గ్రీజు పూయలేదు.. తాళ్లు బిగించలేదు.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ సుంకేసుల రిజర్వాయర్తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, శ్రీశైలం జలాశయానికి సంబంధించి మొత్తం 32 మెకానిక్ పనులు చేపట్టేందుకు రూ.3.68 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తొలుత రూ.70 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అన్ని పనులు చేయడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, సమయం తక్కువ ఉండటంతో ప్రస్తుతం అత్యవసర పనులకు మాత్రమే అంచనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.
గేట్ల బాగుకు ప్రాధాన్యం
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి నాలుగు పాత గేట్లు, 10 కొత్త గేట్ల నిర్వహణకు రూ.1.50 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఈ నిధులతో గేట్లకు గ్రీజు పూయడంతో పాటు టర్న్ బకిల్స్ తదితర పనులు చేపట్టనున్నారు.
- శ్రీశైలం జలాశయానికి సంబంధించి మొత్తం 12 రేడియల్ క్రస్ట్ గేట్లు, స్పిల్వే కింద భాగంలో ఉన్న రెండు స్లూయిస్ గేట్ల నిర్వహణ, శాండ్ బ్లాస్టింగ్, టర్న్ బకిల్స్, గ్రీజు పూయడం, రబ్బరు సీల్స్ పనులు, గేట్ల తీగల నిర్వహణకు నిధులను ఉపయోగించనున్నారు.
- సుంకేసుల ఆనకట్ట వద్ద మెకానికల్ పనులు చేపట్టేందుకు రూ.53 లక్షలు కోరారు. వీటితో సాధారణ మరమ్మతులు, గ్రీజు పూయడం వంటి పనులు చేయనున్నారు.
- తాజాగా మరో నివేదిక అడగడంతో అత్యవసరంగా 175 పనులకు రూ.18.75 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా నివేదికలు తయారు చేశారు. వీటిని ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వానికి సోమవారం అందజేస్తామని కర్నూలు సీఈ కె.కబీర్ బాషా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం జలాశయానికి వరద నీరు
[ 30-06-2024]
ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 456 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. -
ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
[ 30-06-2024]
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా నాయకులకు వత్తాసు
[ 30-06-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు -
హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
[ 30-06-2024]
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు
[ 30-06-2024]
అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు -
వైకాపా సహకార బ్యాంకు
[ 30-06-2024]
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు. -
రేపే పింఛను పండగ
[ 30-06-2024]
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, -
జాతీయ లోక్అదాలత్లో.. 1,139 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. -
మాన్యం భూముల మేతలు
[ 30-06-2024]
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు -
నాడితప్పిన నిర్వహణ
[ 30-06-2024]
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
-
టీమ్ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?
-
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
-
ఎవరిని అడగాలి? తిరిగిరాని ధరణి స్లాట్ రద్దు సొమ్ములు
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ