నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక : మంత్రి టీజీ భరత్
ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో కర్నూలు నగరంలో రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నరగ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్అండ్బీ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి టీజీ భరత్
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో కర్నూలు నగరంలో రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నరగ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ప్రభుత్వ అతిథి గృహంలో ఆర్అండ్బీ శాఖ అధికారులతో రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్షించారు. జనాభాకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కూడలి రాజ్విహార్లో ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఆనంద్ థియేటర్ ఎదురుగానున్న హంద్రీ వంతెన వద్ద నుంచి వాహనాలు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఫ్లైఓవర్, అండర్ పాస్ వంతెన నిర్మించేందుకు అధ్యయనం చేయాలన్నారు. రాజ్విహార్ కూడలిని విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. కోర్టు భవనాలతోపాటు జడ్జిల నివాసాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించి మరమ్మతులు చేయాలన్నారు. చిన్నపిల్లల పార్కు నుంచి వడ్డెగేరి, ఉస్మానియా కళాశాల మీదుగా బుధవారపేట, కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు, దుకాణదారులతో మాట్లాడి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. కర్నూలు నుంచి కల్లూరుకు వెళ్లే మార్గంలోని వక్కెర వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించేందుకు అధ్యయనం చేయాలన్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఎస్ఏపీ క్యాంపులో వచ్చే విధంగా పరిశీలించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఈఈలు సురేష్బాబు, కృష్ణారెడ్డి, డీఈలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం జలాశయానికి వరద నీరు
[ 30-06-2024]
ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 456 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. -
ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
[ 30-06-2024]
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా నాయకులకు వత్తాసు
[ 30-06-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు -
హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
[ 30-06-2024]
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు
[ 30-06-2024]
అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు -
వైకాపా సహకార బ్యాంకు
[ 30-06-2024]
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు. -
రేపే పింఛను పండగ
[ 30-06-2024]
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, -
జాతీయ లోక్అదాలత్లో.. 1,139 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. -
మాన్యం భూముల మేతలు
[ 30-06-2024]
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు -
నాడితప్పిన నిర్వహణ
[ 30-06-2024]
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేత.. భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు