రాతివనాల్లో బాలకృష్ణ స్టెప్పులు
ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో గురువారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు జరుగనున్నట్లు సమాచారం.
ఓర్వకల్లులోని రాతివనాల్లో చిత్రీకరణ బృందం
ఓర్వకల్లు, న్యూస్టుడే: ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో గురువారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు జరుగనున్నట్లు సమాచారం. సితారా ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, ప్రత్యజ్ఞజ్వాలా కథానాయికగా ఎన్బీకే 109 నిర్మిస్తున్న సినిమాలో పాటను, కొన్ని విలన్ సీన్లను చిత్రీకరించారు. బాలకృష్ణ తన అనుచరులకు గన్ ఫైరింగ్ నేర్పించే విధానాన్ని, ఫైట్ సీన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. షూటింగ్ విరామ సమయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, తుగ్గలి నాగేంద్ర కలిశారు. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మండలంలో తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ అభిమానులను లోపలకు వెళ్లనీయకుండా కర్నూలు గ్రామీణ సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్సై రాజారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం జలాశయానికి వరద నీరు
[ 30-06-2024]
ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 456 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. -
ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
[ 30-06-2024]
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా నాయకులకు వత్తాసు
[ 30-06-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు -
హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
[ 30-06-2024]
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు
[ 30-06-2024]
అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు -
వైకాపా సహకార బ్యాంకు
[ 30-06-2024]
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు. -
రేపే పింఛను పండగ
[ 30-06-2024]
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, -
జాతీయ లోక్అదాలత్లో.. 1,139 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. -
మాన్యం భూముల మేతలు
[ 30-06-2024]
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు -
నాడితప్పిన నిర్వహణ
[ 30-06-2024]
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు