నంద్యాల బాలికకు లాసెట్లో 9వ ర్యాంకు
నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీకి చెందిన తొమ్మండ్రు గురు హర్షశ్రీ గురువారం ప్రకటించిన ఏపీ లాసెట్ ఫలితాల్లో ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది.
గురు హర్షశ్రీ
రైతునగరం (నంద్యాల), న్యూస్టుడే : నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీకి చెందిన తొమ్మండ్రు గురు హర్షశ్రీ గురువారం ప్రకటించిన ఏపీ లాసెట్ ఫలితాల్లో ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది. హర్షశ్రీ హైదరాబాద్లోని ఎన్టీఆర్ జూనియర్ కళాశాలలో 2022- 24లో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివింది. ఇంటర్లో 991 మార్కులు సాధించి తెలంగాణలో మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 3న తెలంగాణలో నిర్వహించిన లాసెట్లో కూడా హర్షశ్రీకి 71వ ర్యాంకు రావడం విశేషం. హర్షశ్రీ గతేడాది పంజాబ్లోని పటియాలలో జరిగిన ఎన్సీసీ నేషనల్ క్యాంప్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. అనంతరం ఎన్సీసీ పరీక్షలో బి సర్టిఫికెట్ అందుకుంది. భవిష్యత్తులో లా డిగ్రీ పూర్తిచేసి జ్యూడీషియల్ సర్వీసెస్లో చేరడమే లక్ష్యమని ఈ విద్యార్థిని చెబుతోంది. హర్షశ్రీ తల్లి గోస్పాడు మండలం పార్వతీపురం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా, తండ్రి గురుప్రసాద్ నంద్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
[ 30-06-2024]
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా నాయకులకు వత్తాసు
[ 30-06-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు -
హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
[ 30-06-2024]
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు
[ 30-06-2024]
అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు -
వైకాపా సహకార బ్యాంకు
[ 30-06-2024]
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు. -
రేపే పింఛను పండగ
[ 30-06-2024]
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, -
జాతీయ లోక్అదాలత్లో.. 1,139 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. -
మాన్యం భూముల మేతలు
[ 30-06-2024]
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు -
నాడితప్పిన నిర్వహణ
[ 30-06-2024]
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు