మా అమ్మది రాజకీయ హత్యే
తమ తల్లి హత్యలో ఆస్తి కోణం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవర్థన్రెడ్డి, రమ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం అట్ల శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.
ప్రధాన నిందితులైన ఏవీ దంపతులను అరెస్టు చేయాలి
హతురాలు అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవ్ధన్రెడ్డి, రమ్య డిమాండు
శ్రీదేవి అంత్యక్రియల్లో అఖిలప్రియ దంపతులు
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: తమ తల్లి హత్యలో ఆస్తి కోణం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవర్థన్రెడ్డి, రమ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం అట్ల శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. తమ చిన్నాన్నతో 20 ఏళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయని, ఇన్నేళ్లుగా జరగనివి ఇప్పుడు జరుగుతున్నాయంటే అందుకు రాజకీయ కోణమే కారణమన్నారు. హత్యకు ఏవీ సుబ్బారెడ్డి దంపతులు కుట్రలు పన్నుతున్నారని తమ తల్లి కొన్ని రోజుల కిందటే తమకు సమాచారం ఇచ్చారన్నారు. తమ చిన్నాన్న, బాబాయ్లతో ఏవీ సుబ్బారెడ్డే ఈ హత్య చేశారని వారు ఆరోపించారన్నారు. బోండా ఉమ మద్దతుగా ఉన్నారనే ఏవీ ఇంతకు తెగించారన్నారు. ఒక తెదేపా కార్యకర్తగా పార్టీ గెలుపుకోసం తమ తల్లి ఎంతో కృషి చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై హత్యాయత్నం ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అప్పుడే పోలీసులు అరెస్టు చేసి ఉంటే తమ తల్లి హత్య జరిగేది కాదని వారు ఆరోపించారు. బాబాయ్ త్రినేత్ర మోహన్రెడ్డి మాట్లాడుతూ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏవీ దంపతులను వెంటనే పోలీసులు అరెస్టు చేయకపోతే ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. గతంలో తనపై కూడా ఏవీ సుబ్బారెడ్డే హత్యాయత్నం చేశారని, రాయలసీమలో ఒక మహిళను హత్య చేసేందుకు ఏవీ సుబ్బారెడ్డి పూనుకోవడం దుర్మార్గమన్నారు.
భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు
ఆళ్లగడ్డలో అట్ల శ్రీదేవి అంత్యక్రియలు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పాల్గొన్నారు. అంత్యక్రియల్లో పాల్గొని భార్గవ్ రామ్ పాడె మోశారు. సబ్ డివిజన్ పరిధి నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆళ్లగడ్డకు తరలివచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు
[ 30-06-2024]
అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా నాయకులకు వత్తాసు
[ 30-06-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కొంత మంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆ పార్టీ నాయకులపై అభిమానం తగ్గడం లేదు -
హంద్రీలో ఆక్రమణలు తొలగించండి
[ 30-06-2024]
కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. -
ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు
[ 30-06-2024]
అక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్రెడ్డి రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు -
వైకాపా సహకార బ్యాంకు
[ 30-06-2024]
ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు. -
రేపే పింఛను పండగ
[ 30-06-2024]
పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్ బారినపడి వీల్ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, -
జాతీయ లోక్అదాలత్లో.. 1,139 కేసుల పరిష్కారం
[ 30-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 ప్రాంతాల్లోని 23 కోర్టు బెంచుల్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ ద్వారా 1,139 కేసులు పరిష్కారమయ్యాయి. -
మాన్యం భూముల మేతలు
[ 30-06-2024]
ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు -
నాడితప్పిన నిర్వహణ
[ 30-06-2024]
సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు