తెదేపా మహిళా నేత హత్యకేసులో కిరాయి హంతకుల హస్తం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ తెదేపా మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసు జాగిలంతో సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ తెదేపా మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులు ఆమెను హత్య చేసేందుకు కిరాయి ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నలుగురు కిరాయి ముఠా సభ్యులు హత్యలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిలో ఒకరు గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. వివాహితను ప్రేమించిన ఆయన తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఆమె భర్తను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. మరొకరు రుద్రవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నారు. వారితో పాటు మరో ఇద్దరు డబ్బు కోసం ఈ హత్య ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. హత్య కేసులో కీలక సమాచారం సేకరించే క్రమంలో భాగంగా బుధవారం పోలీసు జాగిలాన్ని ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయిదుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆస్తి తగాదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
నిందితులుగా ఏవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు
అట్ల శ్రీదేవి హత్య కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మొదటి ముద్దాయిగా ఏవీ గోపాల్రెడ్డి ఉండగా భార్య ఏవీ శిరీష, కుమారుడు కేదార్నాథరెడ్డితో పాటు, ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ రుక్మిణమ్మ, జశ్వితరెడ్డి, చరిష్మారెడ్డి, జాహ్నవి రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కొండారెడ్డి, హుస్సేన్రెడ్డితో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.