పల్లె ఖాతాలు ఖాళీ చేసేశారు
వైకాపా ప్రభుత్వ హయాంలో తాము దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. విద్యుత్తు బిల్లుల పేరుతో నిధులు లాక్కొన్నారు.. ఎంత ఖర్చయిందన్న వివరాలు తెలియడం లేదు.
వైకాపా హయాంలో కష్టాలు ఎదుర్కొన్నాం
ఆర్థిక సంఘం సభ్యులకు సర్పంచుల మొర
సర్పంచుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్.ఎఫ్.సి. సభ్యుడు ఆచార్య ఎం.ప్రసాదరావు.
పక్కన నంద్యాల డీపీవో మంజులవాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు
ఈనాడు, కర్నూలు : వైకాపా ప్రభుత్వ హయాంలో తాము దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. విద్యుత్తు బిల్లుల పేరుతో నిధులు లాక్కొన్నారు.. ఎంత ఖర్చయిందన్న వివరాలు తెలియడం లేదు.. పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు చెల్లించడంలో అంతులేని జాప్యం జరుగుతోంది.. కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని పల్లె ప్రథమ పౌరులు(సర్పంచులు) ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్ఎఫ్సి సభ్యులు పంచాయతీరాజ్ సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సర్పంచులు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు వీలుగా సమావేశం ఏర్పాటుచేశామని ఎస్ఎఫ్సి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులు పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసేశారు.. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛాంధ్ర] కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేసేవారని... గతేడాది ఏప్రిల్ నుంచి నిధులు విడుదల చేయలేదన్నారు. ఇసుక రీచ్లు ఉన్న ప్రాంతాల నుంచి లక్షల టన్నుల ఇసుకను తరలించినా పంచాయతీలకు మాత్రం సీనరేజి నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవని చెప్పారు. అనధికారికంగా గ్రావెల్ తవ్వి రాత్రి వేళల్లో తరలించారని ఆరోపించారు. గ్రామాల్లో లేఅవుట్లు వేస్తున్నవారి నుంచి రుసుములను వసూలు చేస్తున్నా ఆ మొత్తంలో పంచాయతీకి ఎలాంటి వాటా ఇవ్వడం లేదన్నారు. ఆర్థిక సంఘం నిధులు ఏమాత్రం సరిపోవడంలేదని వివరించారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎస్.ఎఫ్.సి. సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గతేడాది నుంచి ఆన్లైన్లో పన్నులు చెల్లించే పద్ధతి అమలవుతోందని.. ఈ ప్రక్రియ మరింత సులభతరం కావాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారు. పలు అంశాలను నంద్యాల డీపీవో మంజులావాణి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, కర్నూలు డీపీవో టి.నాగరాజనాయుడు, డివిజినల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్.ఎఫ్.సి. సభ్యులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ ఆధ్వర్యంలో కేఎంసీ రెవెన్యూ విభాగ సిబ్బందితో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..