క్రస్టుగేట్ల పనులు ప్రారంభం
కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు.
నాలుగో గేటు వద్ద పనులు చేస్తున్న సిబ్బంది
గోనెగండ్ల, న్యూస్టుడే : కొత్త ప్రభుత్వ హయాంలో గాజులదిన్నె సంజీవయ్య సాగర్ జలాశయం ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రూ.57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పింది. ఆ తర్వాత కేవలం రూ.5 కోట్లతో గేట్ల పనులు ప్రారంభించారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారుడు మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో జలాశయం క్రస్టుగేట్ల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జలాశయానికి వరదనీరు వస్తే ఆనకట్టకు ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన ఈనెల 19న జలాశయాన్ని పరిశీలించారు. అడ్డదిడ్డంగా జరుగుతున్న పనులను చూసి అధికారులపై మండిపడ్డారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం జలాశయం రెండు, నాలుగో క్రస్టుగేట్ల వద్ద పనులు ప్రారంభమయ్యాయి. స్టాఫ్లాక్ గేటు ద్వారా నూతన గేట్లను సిద్ధం చేస్తున్నారు. నూతన గేట్లకు రోప్ కనెక్షన్లు తదితరాలు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ శైలేశ్వర్ తెలిపారు. మరో 20 రోజుల్లో ప్రాజెక్టుకు గేట్ల పనులు పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు