వైకాపా కార్యాలయాలకు తాఖీదులు
కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు.
ఆదోనిలో వైకాపా నేత ఎర్రిస్వామికి తాఖీదులు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది
ఈనాడు-కర్నూలు, ఆదోని పురపాలకం, న్యూస్టుడే: కర్నూలు నగరంతోపాటు ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాలకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. ఆదోనిలో పురపాలక పట్టణ విభాగం ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లిన సచివాలయ ఉద్యోగులు భవన లీజుదారుడైన వైకాపా నాయకుడు ఎర్రిస్వామికి తాఖీదులు అందజేశారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. నోటీసుల జారీపై రెండు రోజులుగా హైడ్రామా నడిచింది. వైకాపా కార్యాలయానికి అనుమతులు లేని విషయం బయటకు తెలిసినా చర్యలు తీసుకొనేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.
ఇలా అందుకుని.. అలా సమాధానం పంపి
కర్నూలు నగరంలో వైకాపా కార్యాలయ నిర్మాణానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై నగరపాలక అధికారులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలికి మంగళవారం తాఖీదులు జారీ చేశారు. 24వ తేదీన జారీ చేసినట్లుగా నోటీసులో పేర్కొన్నప్పటికీ ఆ లేఖను మంగళవారం మధ్యాహ్నమే ఇవ్వడం గమనార్హం. నోటీసులు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఎస్.సత్యనారాయణమ్మ ఐదు పేజీల సమాధానాన్ని కమిషనర్కు పంపారు. నోటీసులోని అంశాలను ముందుగానే వైకాపా పెద్దలకు లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఖాళీ స్థలం పన్ను చెల్లించలేదని అధికారులు తమకు పంపిన నోటీసులో పేర్కొన్నారని, తాము రూ.25.09 లక్షల వీఎల్టీ చెల్లించామని లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి కార్పొరేషన్ అధికారులు సూచించిన మొత్తాన్ని చెల్లించలేదు. బకాయిలు ఉన్న విషయం ప్రస్తావించకుండా వీఎల్టీ చెల్లించామని పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్