పురపాలకలో పెత్తందారులు
ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు.
ఆదోనిలో వైకాపా నాయకుల ఆధిపత్యం
వారికి వంతపాడిన అధికారులు
దెబ్బతిన్న ఎస్.ఎస్.ట్యాంకు
ఆదోని పురపాలకం, న్యూస్టుడే : ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు.
ఆయన ఇంటికెళితేనే పనులు
ఆదోని పురపాలక కార్యాలయంలో వైకాపా ప్రజాప్రతినిధులు చెప్పిన పనిచేస్తేనే ఉద్యోగంలో కొనసాగే పరిస్థితి. లేకుంటే వారిని మార్చేయడం రివాజుగా మారింది. ఐదేళ్లలో ఐదుగురు కమిషనర్లు, ఐదుగురు మున్సిపల్ ఇంజినీర్లు బదిలీ అయ్యారు. పురపాలక అధికార గణమంతా వైకాపా ప్రజాప్రతినిధి చుట్టూ తిరగాల్సిందే. ఏ పనికైనా ముందుగా ఆయన ఇంటికి వెళ్లి రావాల్సిందే. ఫైళ్లు పట్టుకుని ఆయన ముందు నిల్చోవాల్సిందే. ప్రతి విభాగంలో ఓ కోవర్టును పెట్టి.. ఏం జరిగినా ఇట్టే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు
గతంలో వైకాపా ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి మేనేజరుగా పోస్టింగ్ వేసుకున్నారు. ఉద్యోగుల బదిలీలు, మెడికల్ బిల్లులు, జీతాలు.. అన్నీ ఆయనే చూసుకునేవారు. చెయ్యి తడపనిదే బిల్లు పాస్ కాదు.. ఆయన వేధింపులతో ఓ ఆర్వో ఆత్మహత్య చేసుకున్నారు. కేసు ముందుకెళ్లకుండా వైకాపా నేతలు చక్రం తిప్పారు. గతేడాది ఇదే మేనేజరు ఏసీబీకి పట్టుబడ్డారు.
అక్రమాలు వెలికితీసినా..
గడప గడపకు మన ప్రభుత్వం కింద విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలో పనులు చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకు రాకపోవడంతో నామినేషన్్ కింద పార్టీ నాయకులకే అప్పగించారు. పనులన్నీ నాసిరకంగా జరిగాయి. చివరికి పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి నిజాలు వెలికితీశారు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో చర్యలు లేకుండానే బిల్లులు మంజూరవడం గమనార్హం.
అన్ని పనులూ వారికే..
పురపాలక సంఘంలో ఏటా సాధారణ బడ్జెట్ రూ.50- 60 కోట్లతో పాటు ప్రత్యేక గ్రాంట్లు, ఇతరాలు కలిపి రూ.15-20 కోట్లకుపైగా ఉంటుంది. సాధారణ నిధులతో చేపట్టే పనులకు అంతేలేకుండా పోయింది. కౌన్సిల్ ఆమోదం ఉంటే చాలు.. ఏ బిల్లయినా పాస్ చేసుకోవచ్చు. ఏ టెండరైనా వైకాపా వారికే దక్కేలా చూశారు. ఏటా నిర్వహించే మార్కెట్ వేలాలు సైతం వారే సొంతం చేసుకునేవారు.
మరమ్మతుల పేరుతో స్వాహా
ఆదోని పట్టణ ప్రజల దాహార్తి తీర్చే బసాపురం ఎస్.ఎస్.ట్యాంకు దెబ్బతింది. మరమ్మతుల పేరుతో రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. కట్ట కుడివైపు కోతకు గురైంది. రివిట్మెంట్ పనుల పేరుతో నిధులు వెచ్చించారు. పనులు నాసిరకంగా జరిగాయి. అప్పటికే సదరు గుత్తేదారుడికి రూ.కోటి దాకా బిల్లులు మంజూరు చేశారు. పనులు అధ్వానంగా ఉండటంతో మిగిలిన బిల్లులు ఇవ్వలేదు. ఒత్తిడి తీసుకురావడంతో ఓ ఎంఈ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది.
- 2023లో బసాపురం ఎస్.ఎస్.ట్యాంకు కట్ట దెబ్బతినడంతో మరమ్మతుల పేరుతో రూ.25 కోట్లతో అంచనాలు రూపొందించారు. అంత ఇచ్చేందుకు అప్పటి వైకాపా ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరికి తాత్కాలిక పనులంటూ రూ.45 లక్షలతో అంచనాలు రూపొందించారు. పనులు చివరికి వచ్చేసరికి ఖర్చు రూ.కోటి దాటింది. ఓ అధికారి బిల్లులు మంజూరు చేసేందుకు వెనకడుగు వేయడంతో ఒత్తిడి తెచ్చి బిల్లులు విడుదల చేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్