భూసారం.. నిస్సారం
అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి.
గతేడాది మట్టి నమూనాల సేకరణ
ఇప్పటివరకు పరీక్షలు చేయని వైనం
నిధుల కేటాయింపులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం
కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని భూసార పరీక్షా కేంద్రంలో ఏడాది కాలంగా మూలుగుతున్న మట్టి నమూనాలు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది వేసవిలో నేల ఆరోగ్య స్థితి పత్రాలపై అప్పటి ప్రభుత్వం ఏడీఏలు, ఏవోలు, వీఏఏలకు శిక్షణ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో 10,252, నంద్యాల జిల్లాలో 10,080 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యాలు నిర్దేశించారు. నంద్యాల జిల్లాలో 28 మండలాల నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని భూసార పరీక్షా కేంద్రానికి, కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో సేకరించిన నమూనాలను ఎమ్మిగనూరు కేంద్రానికి పంపారు.
ఖరీఫ్ ప్రారంభమైనా..
2024-25లో కర్నూలు జిల్లాలో 19,500, నంద్యాల జిల్లాలో 17,300 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యం విధించారు. జూన్ నెలాఖరుకల్లా సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో సేకరించాల్సి ఉండగా ఖరీఫ్ ప్రారంభమై మూడు వారాలు గడిచినా ఇప్పటి వరకు మండలాలకు లక్ష్యాలు నిర్దేశించలేదు.
ఒక్క పైసా ఇవ్వక..
భూసార పరీక్షా కేంద్రాల్లో మట్టి నమూనాలు పరీక్షించాలంటే రసాయనాలకు బడ్జెట్ అవసరమవుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద కేంద్రం బడ్జెట్ కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి పరీక్షలు చేయించాల్సి ఉండగా 2023-24లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, డోన్లో భూసార పరీక్షా కేంద్రాలున్నాయి. నంద్యాల జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలు ఏడాదికి పైగా పనిచేయడం లేదు. కర్నూలు జిల్లాలోని కర్నూలు వ్యవసాయ మార్కెట్, ఎమ్మిగనూరులో భూసార పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎమ్మిగనూరు కేంద్రంలో విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించని దయనీయ పరిస్థితి నెలకొంది.
రూ.30 లక్షలకుపైగా అవసరం
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల నిర్వహణకు బడ్జెట్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాకు రూ.6.71 లక్షలు, నంద్యాల జిల్లాకు 6.17 లక్షలు మంజూరు చేసింది. గతేడాది సేకరించిన 20 వేల మట్టి నమూనాలను పరీక్షించేందుకు రూ.30 లక్షలకుపైగా నిధులు అవసరం.. మంజూరైన బడ్జెట్ మేరకు వారం, పది రోజుల్లో మట్టి పరీక్షలను పరీక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
- ఉమ్మడి జిల్లాలో మట్టి పరీక్షలను పరీక్షించేందుకు వ్యవసాయాధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు మరో 10 మంది అవసరం ఉంది. డిప్యుటేషన్ కింద సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటివరకు భూసార పరీక్షా కేంద్రాలకు వీరిని డిప్యుటేషన్పై నియమించలేదు. ఫలితంగా మట్టి పరీక్షల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు