అక్షర తేజం రామోజీరావు
తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
నివాళి అర్పిస్తున్న ఎంపీడీవో రఘురామ్, కార్యాలయ సిబ్బంది
ఉయ్యాలవాడ, న్యూస్టుడే : తెలుగు జాతి గర్వించే అక్షర తేజం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని ఎంపీడీవో రఘురామ్ అన్నారు. ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రామోజీరావు నిత్య జీవన శైలిలో ఉన్న సమయపాలన, క్రమశిక్షణ, నిరాడంబరతను ప్రతి పౌరుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈవోఆర్డీ మహేంద్రరెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ ప్రనీత్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సాంకేతిక సహాయకులు ఉన్నారు.
27న సంస్మరణ సభ
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అరుదైన వ్యక్తి అని, కర్నూలు నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరూరు రాఘవేంద్ర, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో రాఘవేంద్ర మినీ బ్లాంకెట్ హాలులో 27వ తేదీన సంస్మరణ సభ నిర్వహించనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఫొటో, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి అధ్యక్షత వహించారు. కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నారు. బీసీ చైతన్య సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషుఫణి, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు, గోపాల్, శివయ్య, శ్రీను పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.