ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును స్వాగతిస్తాం
వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న సోమిశెట్టి, తెదేపా నాయకులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత తెదేపా ప్రభుత్వం తొలి మంత్రి మండలి సమావేశంలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన తెదేపా కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే బషీర్, పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ధరూర్ జేమ్స్ తదితరులు మంగళవారం ఎన్టీఆర్ ప్రతిమకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చడం వల్ల ఇప్పటి వరకు చదువుకుని ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులు ఇబ్బందులు పడతారని అనేక మంది వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఎన్టీఆర్ పేరును తొలగించిందన్నారు. ఇక్కడ విద్యనభ్యసించి విదేశాలకు వెళ్లే వైద్య విద్యార్థులకు కళాశాల పేరు మారడంతో సాంకేతికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తెదేపా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాల వెంకటేశ్వరరెడ్డి, ఆదాము, భాస్కర్ పాల్గొన్నారు.
యావజ్జీవ శిక్షపడేలా కేసులు నమోదు చేయాలి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో ప్రజల ఆస్తులు స్వాహా చేసిన జగన్రెడ్డికి యావజ్జీవ శిక్ష పడేలా ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండు చేశారు. తెదేపా కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి మాట్లాడారు. 2019లో ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను కాజేసేందుకు కుట్రలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చారన్నారు. ఆయనపై కేసులు నమోదు చేసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్ల పాలనలో ఆక్రమించిన భూములు సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన