logo

Kurnool: కలిసికట్టుగా ఆదోనిని అభివృద్ధి చేద్దాం

ఆదోని పట్టణాన్ని అభివృద్ధిని చేసుకుందామని నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైకాపా కౌన్సిల్ సభ్యులకు పిలుపునిచ్చారు.

Published : 29 Jun 2024 17:06 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణాన్ని అభివృద్ధిని చేసుకుందామని నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైకాపా కౌన్సిల్ సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యుడుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పురపాలక సంఘంలో మొత్తం 42 వార్డులు ఉన్నాయని, 41 మంది వైకాపా సభ్యులు ఉంటే, కేవలం ఒకరు మాత్రమే తెదేపా సభ్యురాలు ఉన్నారన్నారు. ఆదోనిలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని, సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సభ్యులు ముందుకు వస్తే కలిసికట్టుగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో పురపాలక అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని