logo

Kurnool: ఎమ్మెల్యేని కలిసిన నాయకులు

పట్టణంలోని కర్నూల్ రోడ్డు నందు ప్రధాన రోడ్డుకు ఇరువైపులగల హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి పరిరక్షణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు.

Published : 03 Jul 2024 16:18 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని కర్నూల్ రోడ్డు నందు ప్రధాన రోడ్డుకు ఇరువైపులగల హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి పరిరక్షణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు. కొంతమంది స్మశాన వాటిక భూమిని ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్మశాన వాటిక పరిరక్షణకు ప్రధానంగా అవసరమైన ప్రహరీగోడ నిర్మాణం, మౌలిక సౌకర్యాల అభివృద్ధికి తోడ్పడాలని వినతి పత్రాన్ని సమర్పించారు. నాయకులు నాగరాజు, ఎల్లంబీడు లక్ష్మన్న, వెంకటేష్, బీరప్ప, రవిప్రసాద్, హరి, రవి, నాగేష్, ఉరుకుందు  ,యాపిలయ్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని