logo

Telugu news: అమ్మవారికి బంగారు హారం విరాళం

శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శనివారం లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని బహూకరించారు.

Published : 29 Jun 2024 21:34 IST

సున్నిపెంట సర్కిల్ : శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శనివారం లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన నూకాల నటరాజ్ అనే భక్తుడు 375.4 గ్రాముల ఈ హారాన్ని అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు మార్కండేయ స్వామి, ఆలయ ఏఈఓ హరిదాసుకు అందజేశారు. ఈ హారం విలువ సుమారు రూ. 24.42 లక్షలు ఉంటుందని దాతలు పేర్కొన్నారు. ఈ హారాన్ని బహుకరించిన దాతలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం పలికి స్వామి అమ్మవార్ల శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని