logo

Kurnool: సగర సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నిక

సగర సంఘం నంద్యాల నూతన జిల్లా కమిటీని ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 03 Jul 2024 19:34 IST

రైతునగరం (నంద్యాల): సగర సంఘం నంద్యాల నూతన జిల్లా కమిటీని ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం స్థానిక జంబులా పరమేశ్వరి దేవాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సగర సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా సగర సంఘం అధ్యక్షుడుగా ఉప్పరి సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సాగర్, కోశాధికారిగా శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులుగా బాల మద్దిలేటి, సలహాదారుగా ఎరుకలయ్యను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సగర సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, రాధమ్మ, సుబ్బరాయుడు, టిపై శివయ్య, వెంకటస్వామి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని