logo

Kurnool: ఘనంగా తిరుచ్చి వేడుకలు

మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసిహ స్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Published : 28 Jun 2024 21:01 IST

ఆర్ఎస్ రంగాపురం (బేతంచెర్ల): మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసిహ స్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్, ఈవో రామాంజనేయులు వేదపండితులు, అర్చకులు మనోహర్, నరసింహ, మద్దిలేటిస్వామిలు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారిని కన్నుల పండువగా ఊరేగింపు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనసందోహం మధ్య గోవిందనామ స్మరణల మధ్య స్వామి వారు ఆలయ పరిసరాల్లో పుష్పాలంకరణ శోబితుడై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని