logo

Kurnool: వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని ఈవోఆర్‌డీ బాలన్న అన్నారు.

Published : 29 Jun 2024 21:33 IST

చిప్పగిరి: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని ఈవోఆర్‌డీ బాలన్న అన్నారు. శనివారం చిప్పగిరి మండలం నెమకల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మనం నివాసం ఉన్న ప్రాంతాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఏ అంటు వ్యాధులు రావని బాలన్న, సచివాలయ ఏఎన్ఎం సువర్ణమ్మ గ్రామ ప్రజలకు మహిళలకు తెలిపారు. శనివారం నేమకల్లు గ్రామంలో బాలన్న ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పలు వీధులలో పంచాయతీ కార్మికుల చేత పరిసరాలు పరిశుభ్రం చేయిస్తూ అంటువ్యాధులైన డయేరియా, మలేరియా పై ప్రజలకు మహిళలకు తగు సూచనలు ఇస్తూ అవగాహన కల్పించారు. ఇజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మీ, ఆశాలు కవిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని