logo

Kurnool: కలిసొచ్చే వారిని కలుపుకుపోతా

ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి కలిసి వచ్చే వారిని కలుపుపోతానని ఆదోని భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.

Published : 03 Jul 2024 16:15 IST

ఆదోని మార్కెట్: ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి కలిసి వచ్చే వారిని కలుపుపోతానని ఆదోని భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్‌లో వైకాపా నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం తనకు రాజకీయాలతో నిమిత్తం లేకుండా పనిచేస్తానన్నారు. ఆదోనిలో ఎన్ని పార్టీలున్న ఎంతమంది కలిసి వచ్చిన అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. పార్టీలో చేరిన వారిలో ఆదోని మండల ఎంపీపీ దానమ్మ, వార్డు కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి తోపాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, భాజపా జిల్లా అధ్యక్షుడు నీలకంఠ, నాయకులు నాగరాజు గౌడ్, శ్రీనివాసచారి, ఉపేంద్ర, సాయికుమార్, మల్లిక తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని