logo

Kurnool: నవ వధువు ఆత్మహత్య

బేతంచెర్ల పట్టణం అయ్యల చెరువులో ఓ పాలీష్ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన వన వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 28 Jun 2024 20:37 IST

బేతంచెర్ల: బేతంచెర్ల పట్టణం అయ్యల చెరువులో ఓ పాలీష్ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన వన వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహర్ రాష్ట్రం, సారెన్ జిల్లా, పటేరి గ్రామానికి చెందిన గురూజి సింగ్‌కు ఏప్రిల్ 20న నేహాకుమారి పాండేతో (23) వివాహం జరిగింది. మూడు రోజుల కిందట బీహార్ నుంచి బేతంచెర్లకు వచ్చి నాపరాయి పరిశ్రమలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. తల్లిదండ్రులను వదలి ఒంటిరిగా ఉండలేక జీవితంపై మనస్థాపం చెందిన మహిళ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గమణించిన భర్త ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం. శవ పరీక్ష నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని