Adoni: బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే : అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న ఆ పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని అతడిని వదిలేసినట్లు తెలిసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ఓ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదోని డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్లో బెంగళూరు నుంచి వచ్చిన రైలులో ఓ పోలీసు అధికారి తనిఖీ చేస్తుండగా ఆదోని పట్టణానికి చెందిన ఓ బడా బంగారు వ్యాపారి ఒకరు పెద్దమొత్తంలో బంగారాన్ని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా దాదాపు రూ.కోటి విలువ చేసే కిలోన్నరకుపైగా బంగారాన్ని గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా జీరో పద్ధతిలో తరలిస్తున్నట్లు నిర్ధారించారు. సదరు వ్యాపారిని అదుపులో తీసుకొని బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయాల్సిన ఆ పోలీసు అధికారి అతడిని వదిలేందుకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం పైస్థాయి అధికారి సహకారం తీసుకొని ఆ వ్యాపారితో రూ.6 లక్షలు బేరం కుదుర్చుకొని బంగారంతోపాటు ఆ వ్యాపారిని వదిలేసినట్లు తెలిసింది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసు అధికారే ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పిచ్చికుక్క స్వైర విహారం
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : నంద్యాల పట్టణంలో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ప్రియాంకనగర్, పద్మావతినగర్, టెక్కె, రెవెన్యూ క్వార్టర్స్ ప్రాంతాల్లో 25 మందిని గాయపరిచింది. పెద్దలతో పాటు పలువురు చిన్నారులూ గాయపడ్డారు. ప్రియాంక నగర్కు చెందిన లక్ష్మీదేవి, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలవడంతో నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చేరారు. మిగిలిన 22 మంది వ్యాక్సిన్లు వేయించుకుని వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పరామర్శించారు.
విత్తనాల పేరుతో మోసం
రూ.4 లక్షలతో పరారీ
మంత్రాలయం, న్యూస్టుడే: మిరప విత్తనాలు పంపిణీ చేస్తానని నమ్మించిన ఓ వ్యక్తి రూ.4 లక్షలతో ఉడాయించాడు. ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి (కొత్తూరు) చెందిన జి.గిడ్డయ్య జెమిని యాక్టివ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సీడ్స్ కంపెనీలో ఆర్గనైజర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటకలోని బూడిదదిన్నే, గంథాలం, ఇడుపనూరు తదితర గ్రామాల్లో దాదాపు 300 మంది రైతుల నుంచి రూ.2 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసుకొని మొత్తం రూ.4 లక్షలకు పైగా వసూలు చేశాడు. జూన్ చివరి కల్లా కంపెనీ నుంచి మిరప విత్తనాలు పంపిణీ చేస్తామని నమ్మ బలికి ఆ నగదు కంపెనీకి కట్టకుండా, రైతులకు విత్తనాలు పంపిణీ చేయకుండా మోసం చేసినట్లు బాధిత రైతులు ఆదివారం మంత్రాలయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చరవాణుల చోరీ కేసుల్లో రిమాండ్
తిరుపతి(లీగల్): శ్రీవారి దర్శన టికెట్ల కోసం వెళ్లే క్యూలైన్లో భక్తుల చరవాణులు చోరీ చేసే ముఠాలోని ఐదుగురు నిందితులను ఈ నెల 12 వరకు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశిస్తూ తిరుపతి నాల్గో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గ్రంథి శ్రీనివాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు హైదరాబాదుకు చెందిన పసుపులేటి శ్రీకాంత్, ఆవుల ఆనంద్, పసుపులేటి ఈశ్వర్, కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రుకుల బన్ని, అనంతపురానికి చెందిన రణకల లోకేష్లు ముఠాగా ఏర్పడి అలిపిరి గరుడ సమీపంలోని భూదేవి కాంప్లెక్సు క్యూలైన్లో భక్తుల చరవాణుల చోరీకి పాల్పడేవారు. అలిపిరి పోలీసుస్టేషన్ పోలీసులు వారిని అరెస్టు చేసి భక్తుల చరవాణులు స్వాధీనపరచుకుని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి.. నిందితులను రిమాండ్కి ఆదేశించారు.
12 తులాల బంగారం అపహరణ
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కర్నూలులో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాసవీ నగర్లో అనంతకృష్ణశర్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఏడాది జూన్ 28న ఆయన తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించడంతో ఇంటికి తాళం వేసి అంతా అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఇంటికి చేరుకునేసరికి దొంగలు తాళం తొలగించి సొత్తును ఎత్తుకెళ్లారు. 12 తులాల బంగారు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రూ.2.40 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు అనంతకృష్ణ శర్మ భార్య అనూష ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలుపు తట్టి ఆనందం కురి‘పింఛెను’
[ 02-07-2024]
అలసిన మనసులకు ఆనందం.. ఒంటరి జీవితాలకు ఓదార్పు.. కదల్లేని అభాగ్యులకు భరోసా... ఉషోదయాన్నే..‘ఎన్టీఆర్ భరోసా’ తలుపు తట్టింది.. ఉద్యోగులే ఇంటికొచ్చి నెలవారీగా అందే పింఛన్ సొమ్మును జేబులో పెట్టారు. -
అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
[ 02-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పెంపు ఒకటని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
కొత్త నేర చట్టాలపై అవగాహన తప్పనిసరి
[ 02-07-2024]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులు, సిబ్బందికి సూచించారు. -
వినతులు త్వరితగతిన పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. -
కీలక మార్గంలో పయనించేందుకు పైరవీలు
[ 02-07-2024]
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మరోసారి అదే పోస్టులో కొనసాగేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం నివ్వెరపరుస్తోంది. -
ఉరూరా పింఛను పండగ
[ 02-07-2024]
జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ పురపాలక సంఘాలతో పాటు మేజర్ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. -
నగరంలో 94.71 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. -
నకిలీ నోటీసులతో బెదిరిస్తున్నారు
[ 02-07-2024]
తన ఇంటికి నకిలీ నోటీసులు పంపుతూ ఎమ్మిగనూరుకు చెందిన శాంతిరాజు డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన వెంకటేష్ ఎస్పీకి విన్నవించారు. -
కర్నూలులో 92... నంద్యాలలో 94.98 శాతం పంపిణీ
[ 02-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4.66 లక్షల మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. మొదటి రోజు సోమవారం 4.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.296.64 కోట్ల్లు అందజేశారు. -
పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ
[ 02-07-2024]
పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. -
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ కర్తవ్యం
[ 02-07-2024]
పేదల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. -
వైకాపా అక్రమాలు వెలికితీస్తాం: బుడ్డా
[ 02-07-2024]
వైకాపా అరాచక పాలనలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు