పల్లె దవాఖానాలకు సుస్తీ..!
పల్లె దవాఖానాల సేవలు ప్రహసనంలా మారాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో తరుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
పల్లె దవాఖానాల సేవలు ప్రహసనంలా మారాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో తరుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరంపై అధికారులు దృష్టి సారించాలి.
వెక్కిరిస్తున్న ఖాళీలు
జిల్లాలో మొత్తం 161 పల్లె దవాఖానాలు ఉన్నాయి. వీటిలో ఎంబీబీఎస్, బీఏఎంస్, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారిని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్హెచ్పీ)గా నియమించి చికిత్సలు అందిస్తారు. కొన్ని కేంద్రాల్లో వైద్యులు, మరికొన్నింటిలో నర్సింగ్ ఆఫీసర్లు ఎంఎల్హెచ్పీగా సేవలందిస్తారు. దవాఖానాల్లో ప్రాథమిక వైద్య సేవలకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు ఔషధాలు అందుబాటులో ఉండాలి. జిల్లాలో బోనకల్లు, కూసుమంచి, ఎంవీపాలెం, గంగారం, మంచుకొండ, వైరా ఆరోగ్య కేంద్రాల పరిధిలోని బ్రాహ్మణపల్లి, బుగ్గపాడు, అయ్యగారిపేట, జక్కెపల్లి, జుజ్జులరావుపేట, మల్లెమడుగు, గుదిమళ్ల, వీవీపాలెం, కోయచలక, సోమవరం, పాలడుగు పల్లె దవాఖానాల్లో వైద్యులు లేరు. దాదాపు పదకొండు ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో స్థానిక ప్రజలకు వైద్యసేవలు అందటం లేదు. అలాగే చాలాకేంద్రాలకు విధిగా ఔషధాలు సరఫరా కావడం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, సీజనల్ వ్యాధులతో బాధపడే రోగులకు ఆశించిన సేవలు లభించడం లేదు. వ్యాధుల తరుణం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతిని వివరణ కోరగా ఉన్నతాధికారుల అనుమతితో పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగన్వాడీ క్రమేణా మారుతోందండీ..
[ 06-07-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కార్యాచరణ రూపొందించింది. -
విప్లవ పార్టీల ఐక్యతా రాగం
[ 06-07-2024]
భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం పోరాటాలు చేస్తున్న విప్లవ పార్టీలు కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక బాట పట్టాయి. పరిణామ క్రమంలో పార్టీ మాతృరూపం పలు వర్గాలుగా విడిపోయింది. -
ఆయకట్కట..
[ 06-07-2024]
చర్ల మండలం పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం ఇది. సుమారు 1,200 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.14.53 కోట్లతో నాలుగేళ్ల క్రితం పగిడివాగుపై దీన్ని నిర్మించారు -
నిర్ణయం మారదు.. తుక్కు వీడదు
[ 06-07-2024]
ఆబ్కారీశాఖ పరిధిలోని నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసులు, పట్టుబడుతున్న నిందితులు, వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది -
భర్త దూరమైనా.. పిల్లలే ప్రాణంగా..
[ 06-07-2024]
భర్త మృతిచెందినా తన గుండెను రాయిగా మార్చుకున్నారు. పిల్లల యోగక్షేమాలే సర్వస్వం అనుకున్నారా మాతృమూర్తి. వితంతు పింఛను, సర్కారీ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పిస్తే కంటిపాపల్లా పిల్లల్ని చూసుకుంటానని అధికారులను అర్థిస్తున్నారు. -
అతి మురిపెం.. ప్రమాదకరం
[ 06-07-2024]
పెంపుడు జంతువులు, పక్షులంటే కొందరికి ప్రీతి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటుంటారు. -
కిరణ్ మృతదేహం కోసం నిరీక్షణ
[ 06-07-2024]
కల్లూరు మండలం చినకోరుకొండికి చెందిన కిరణ్కుమార్రాజు(20) అమెరికాలో ఈత కొలనులో జూన్ 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
[ 06-07-2024]
సన్ఫ్లవర్ క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న ఓ ట్యాంకర్ దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఏకుల పోతమ్మతల్లి దేవాలయం సమీపంలో శుక్రవారం బోల్తా కొట్టింది -
బొగ్గు బ్లాకుల వేలం ఆపేవరకు పోరాటం
[ 06-07-2024]
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
సివిల్ సర్జన్ సస్పెన్షన్
[ 06-07-2024]
వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ సర్జన్ డా.బి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.