విచారణలో వేగం.. సత్వర న్యాయం..!
నూతన నేర, న్యాయ చట్టాల ద్వారా పోలీసుల విచారణ వేగవంతమవుతుందని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందటంతో పాటు నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు.
నూతన నేర, న్యాయ చట్టాలకు ప్రజా శ్రేయస్సే ప్రాతిపదిక
‘ఈనాడు’తో ఎస్పీ రోహిత్రాజు
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
నూతన నేర, న్యాయ చట్టాల ద్వారా పోలీసుల విచారణ వేగవంతమవుతుందని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందటంతో పాటు నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) ఈనెల 1 నుంచి అమలవుతున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో ‘ఈనాడు’తో ఎస్పీ ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..
పోలీసు యంత్రాంగానికి శిక్షణ పూర్తి
కాలానికి అనుగుణంగా పుట్టుకొస్తున్న నేరాలకు సంబంధించి కొత్త సెక్షన్లు, శిక్షలు విధించటానికి నూతన నేర, న్యాయ చట్టాలు దోహదపడతాయి. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటానికి, ప్రజలకు చట్టంపై గౌరవం పెంచటానికి తోడ్పడతాయి. బ్రిటీష్ కాలం నాటి రాచరిక పాలన ఆనవాళ్లను తొలగించి ప్రజా శ్రేయస్సును కాంక్షించి కొత్త చట్టాలను రూపొందించారు. వీటి విధివిధానాలు, అమలు తీరుపై ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి శిక్షణ ఇచ్చాం. పోలీసు సిబ్బందిలో ఇంకెవరికైనా సందేహాలుంటే మరోసారి అవగాహన కల్పిస్తాం.
నేరస్థులు తప్పించుకోలేరు
బీఎన్ఎస్ఎస్ సెక్షన్-187 ప్రకారం పోలీసు కస్టడీ వ్యవధి 15 రోజుల నుంచి 60-90 రోజులకు పెరుగుతుంది. దీన్ని ప్రజలు లేదా నేరస్థులను ఇబ్బంది పెట్టడానికి వినియోగించబోం. చట్టంలోని లొసుగులను వాడుకుని తప్పించుకోవటానికి వీల్లేకుండా, నేరస్థులకు శిక్ష పడేలా ఇది దోహదపడుతుంది. నిందితులను విచారించటానికి 15 రోజుల సమయం సరిపో నప్పుడు పోలీసులకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. నూతన చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులకు మరింత రక్షణ కలుగుతుంది. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాల్లో జవాబుదారితనం, పారదర్శకతకు ఇవి పెద్దపీట వేస్తాయి.
ఈ-ఎఫ్ఐఆర్కు అవకాశం
ఇంతకుముందు చట్టంలో సంబంధిత ఠాణా పరిధిలో నేరాలు జరిగితేనే ఎఫ్ఐఆర్ చేయడానికి అవకాశం ఉండేది. నేరం ఎక్కడ జరిగినా కొత్త చట్టం ప్రకారం బాధితులు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. బాధితులు ఠాణాల చుట్టూ తిరగకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ దోహదపడుతుంది. అయితే ఫిర్యాదుదారు మూడు రోజుల్లో వచ్చి ఫిర్యాదుపత్రం అందించి సంతకం చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎస్హెచ్ఓ విచారణ జరుపుతారు. నేరం జరిగిందని నిర్ధారించుకున్నాకే కేసు నమోదవుతుంది. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం.ఈ-ఎఫ్ఐఆర్ను బీఎన్ఎస్ఎస్ సెక్షన్-173 నిర్వచిస్తుంది. బాధితులు ఠాణాకు రాకుండానే పోలీసు స్టేషన్ మెయిల్ లేదా ఫోన్ నంబర్కు సమాచారమందించవచ్చు. ఇందుకోసం జిల్లాలోని ఠాణాల మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సమన్లు జారీ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.
సాక్షులకు రక్షణ కవచం
నూతన చట్టాలతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుంది. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం ద్వారా సాక్షులకు రక్షణ దొరుకుతుంది. బాధితులకు అధిక ప్రాధాన్యమిస్తూనే.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాలు ఉపకరిస్తాయి. తద్వారా సమాజంలో చట్టాలపై గౌరవం పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగన్వాడీ క్రమేణా మారుతోందండీ..
[ 06-07-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కార్యాచరణ రూపొందించింది. -
విప్లవ పార్టీల ఐక్యతా రాగం
[ 06-07-2024]
భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం పోరాటాలు చేస్తున్న విప్లవ పార్టీలు కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక బాట పట్టాయి. పరిణామ క్రమంలో పార్టీ మాతృరూపం పలు వర్గాలుగా విడిపోయింది. -
ఆయకట్కట..
[ 06-07-2024]
చర్ల మండలం పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం ఇది. సుమారు 1,200 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.14.53 కోట్లతో నాలుగేళ్ల క్రితం పగిడివాగుపై దీన్ని నిర్మించారు -
నిర్ణయం మారదు.. తుక్కు వీడదు
[ 06-07-2024]
ఆబ్కారీశాఖ పరిధిలోని నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసులు, పట్టుబడుతున్న నిందితులు, వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది -
భర్త దూరమైనా.. పిల్లలే ప్రాణంగా..
[ 06-07-2024]
భర్త మృతిచెందినా తన గుండెను రాయిగా మార్చుకున్నారు. పిల్లల యోగక్షేమాలే సర్వస్వం అనుకున్నారా మాతృమూర్తి. వితంతు పింఛను, సర్కారీ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పిస్తే కంటిపాపల్లా పిల్లల్ని చూసుకుంటానని అధికారులను అర్థిస్తున్నారు. -
అతి మురిపెం.. ప్రమాదకరం
[ 06-07-2024]
పెంపుడు జంతువులు, పక్షులంటే కొందరికి ప్రీతి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటుంటారు. -
కిరణ్ మృతదేహం కోసం నిరీక్షణ
[ 06-07-2024]
కల్లూరు మండలం చినకోరుకొండికి చెందిన కిరణ్కుమార్రాజు(20) అమెరికాలో ఈత కొలనులో జూన్ 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
[ 06-07-2024]
సన్ఫ్లవర్ క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న ఓ ట్యాంకర్ దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఏకుల పోతమ్మతల్లి దేవాలయం సమీపంలో శుక్రవారం బోల్తా కొట్టింది -
బొగ్గు బ్లాకుల వేలం ఆపేవరకు పోరాటం
[ 06-07-2024]
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
సివిల్ సర్జన్ సస్పెన్షన్
[ 06-07-2024]
వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ సర్జన్ డా.బి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.