కారు లిఫ్ట్ అడిగి.. కళ్లలో కారం కొట్టి
కారులో వస్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై సార్ ప్లీజ్ లిప్ట్ ఇవ్వండని అడిగి.. కారు ఆపిన వెంటనే ఆ వ్యక్తిని బెదిరించి దుండగులు సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీప ప్రధాన రహదారిపై చోటుచేసుకొంది.
లోతువాగు సమీపంలో దారి దోపిడీ
లక్ష్మీదేవిపల్లి, న్యూస్టుడే: కారులో వస్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై సార్ ప్లీజ్ లిప్ట్ ఇవ్వండని అడిగి.. కారు ఆపిన వెంటనే ఆ వ్యక్తిని బెదిరించి దుండగులు సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీప ప్రధాన రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన వాసాల తిరుపతి వ్యక్తిగత పనిమీద తన కారు నడుపుకొంటూ ఒక్కడే సోమవారం రాత్రి పాల్వంచ వెళ్తున్నాడు. లోతువాగు సమీపంలోని అటవీ ప్రాంతం ఉన్న ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి నిల్చోని కారు ఆపి సార్ ప్లీజ్ లిప్ట్ ఇవ్వండని ప్రాధేయపడ్డాడు. దీంతో అతనికి లిప్ట్ ఇద్దామని తిరుపతి కారు అద్దం తీశాడు. ఆ అంగతకుడు వెంటనే తిరుపతి కళ్లలో కారంపొడి కొట్టాడు. ఇంతలోనే ముఖానికి మాస్క్లు ధరించిన మరో ముగ్గురు వ్యక్తులు కారును చుట్టుముట్టారు. కత్తులతో తిరుపతిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.15 వేలు నగదు, చేతికున్న రెండు ఉంగరాలు, మెడలోని చైన్ కలిపి మొత్తమ్మీద రూ.1.49 లక్షల సొత్తు దోచుకొని అక్కడ నుంచి పరారయ్యారు. తమకు అందిన సమాచారంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి క్లూస్ టీంతో అక్కడకు చేరుకొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
[ 06-07-2024]
భద్రాచలం డివిజన్ మారుమూల చర్ల మండలంలో శనివారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకస్మికంగా పర్యటించారు. సత్యనారాయణపురం గ్రామంలో పర్యటించిన పీవో గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు. -
వనమహోత్సవ కార్యక్రమం
[ 06-07-2024]
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో 75వ వన మహోత్సవం పురస్కరించుకుని ఆమె మొక్కలు నాటారు. -
అశ్వారావుపేటలో వన మహోత్సవం
[ 06-07-2024]
అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి ఒక్కో మొక్క నాటి దత్తత చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
అంగన్వాడీ క్రమేణా మారుతోందండీ..
[ 06-07-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కార్యాచరణ రూపొందించింది. -
విప్లవ పార్టీల ఐక్యతా రాగం
[ 06-07-2024]
భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం పోరాటాలు చేస్తున్న విప్లవ పార్టీలు కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక బాట పట్టాయి. పరిణామ క్రమంలో పార్టీ మాతృరూపం పలు వర్గాలుగా విడిపోయింది. -
ఆయకట్కట..
[ 06-07-2024]
చర్ల మండలం పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం ఇది. సుమారు 1,200 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.14.53 కోట్లతో నాలుగేళ్ల క్రితం పగిడివాగుపై దీన్ని నిర్మించారు -
నిర్ణయం మారదు.. తుక్కు వీడదు
[ 06-07-2024]
ఆబ్కారీశాఖ పరిధిలోని నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసులు, పట్టుబడుతున్న నిందితులు, వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది -
భర్త దూరమైనా.. పిల్లలే ప్రాణంగా..
[ 06-07-2024]
భర్త మృతిచెందినా తన గుండెను రాయిగా మార్చుకున్నారు. పిల్లల యోగక్షేమాలే సర్వస్వం అనుకున్నారా మాతృమూర్తి. వితంతు పింఛను, సర్కారీ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పిస్తే కంటిపాపల్లా పిల్లల్ని చూసుకుంటానని అధికారులను అర్థిస్తున్నారు. -
అతి మురిపెం.. ప్రమాదకరం
[ 06-07-2024]
పెంపుడు జంతువులు, పక్షులంటే కొందరికి ప్రీతి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటుంటారు. -
కిరణ్ మృతదేహం కోసం నిరీక్షణ
[ 06-07-2024]
కల్లూరు మండలం చినకోరుకొండికి చెందిన కిరణ్కుమార్రాజు(20) అమెరికాలో ఈత కొలనులో జూన్ 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
[ 06-07-2024]
సన్ఫ్లవర్ క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న ఓ ట్యాంకర్ దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఏకుల పోతమ్మతల్లి దేవాలయం సమీపంలో శుక్రవారం బోల్తా కొట్టింది -
బొగ్గు బ్లాకుల వేలం ఆపేవరకు పోరాటం
[ 06-07-2024]
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
సివిల్ సర్జన్ సస్పెన్షన్
[ 06-07-2024]
వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ సర్జన్ డా.బి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ ఎన్నికలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
సామాన్యుడిలా సూపర్ మార్కెట్కు బిలియనీర్.. ఇంతకీ ఎవరీయన?
-
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ