లోగుట్టు ఏంటి?
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులతో ఠాణా సిబ్బంది అంటకాగారనే అవినీతి మరకలు, ఉన్నతాధికారుల వేధింపులే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అశ్వారావుపేట, అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్టుడే: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులతో ఠాణా సిబ్బంది అంటకాగారనే అవినీతి మరకలు, ఉన్నతాధికారుల వేధింపులే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఎస్సై సెల్ఫోన్ను స్వాధీనపరచుకున్నారు. తనపై వేధింపులు, సిబ్బంది నుంచి ఎదురైన అవమానాలను సెల్ఫోన్లో ఎస్సై రికార్డు చేసినట్టు సమాచారం. కొంతకాలం క్రితం జరిగిన ఓ సెటిల్మెంట్పై ఇద్దరు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు మందలించినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట ఠాణాలో కొందరు సిబ్బంది కలెక్షన్ ఏజెంట్లుగా మారారని, పంపకాల్లో తేడాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే సీఐ జితేంద్రరెడ్డి పలుమార్లు మెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మనస్తాపంతోనే ఎస్సై ఆత్మహత్యకు యత్నించారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
ఆ నలుగురు వీఆర్కు ఎటాచ్డ్..!
ఎస్సై ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వీఆర్కు ఎటాచ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగన్వాడీ క్రమేణా మారుతోందండీ..
[ 06-07-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు కార్యాచరణ రూపొందించింది. -
విప్లవ పార్టీల ఐక్యతా రాగం
[ 06-07-2024]
భూమి, భుక్తి, పేదల విముక్తి కోసం పోరాటాలు చేస్తున్న విప్లవ పార్టీలు కాలక్రమంలో సైద్ధాంతిక విభేదాలతో చీలిక బాట పట్టాయి. పరిణామ క్రమంలో పార్టీ మాతృరూపం పలు వర్గాలుగా విడిపోయింది. -
ఆయకట్కట..
[ 06-07-2024]
చర్ల మండలం పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం ఇది. సుమారు 1,200 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రూ.14.53 కోట్లతో నాలుగేళ్ల క్రితం పగిడివాగుపై దీన్ని నిర్మించారు -
నిర్ణయం మారదు.. తుక్కు వీడదు
[ 06-07-2024]
ఆబ్కారీశాఖ పరిధిలోని నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. నమోదవుతున్న కేసులు, పట్టుబడుతున్న నిందితులు, వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది -
భర్త దూరమైనా.. పిల్లలే ప్రాణంగా..
[ 06-07-2024]
భర్త మృతిచెందినా తన గుండెను రాయిగా మార్చుకున్నారు. పిల్లల యోగక్షేమాలే సర్వస్వం అనుకున్నారా మాతృమూర్తి. వితంతు పింఛను, సర్కారీ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పిస్తే కంటిపాపల్లా పిల్లల్ని చూసుకుంటానని అధికారులను అర్థిస్తున్నారు. -
అతి మురిపెం.. ప్రమాదకరం
[ 06-07-2024]
పెంపుడు జంతువులు, పక్షులంటే కొందరికి ప్రీతి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి అనేక రకాల జంతువులను పెంచుకుంటుంటారు. -
కిరణ్ మృతదేహం కోసం నిరీక్షణ
[ 06-07-2024]
కల్లూరు మండలం చినకోరుకొండికి చెందిన కిరణ్కుమార్రాజు(20) అమెరికాలో ఈత కొలనులో జూన్ 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
[ 06-07-2024]
సన్ఫ్లవర్ క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న ఓ ట్యాంకర్ దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం ఏకుల పోతమ్మతల్లి దేవాలయం సమీపంలో శుక్రవారం బోల్తా కొట్టింది -
బొగ్గు బ్లాకుల వేలం ఆపేవరకు పోరాటం
[ 06-07-2024]
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. -
సివిల్ సర్జన్ సస్పెన్షన్
[ 06-07-2024]
వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ సర్జన్ డా.బి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు.