గోబెల్స్ను మించిన మోదీ: నారాయణ
అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గోబెల్స్ను మించిపోయాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మాట్లాడుతున్న కె.నారాయణ. పక్కన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు
ఖమ్మం మామిళ్లగూడెం: అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గోబెల్స్ను మించిపోయాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాస్తవికత లేకపోవడంతోనే భాజపా 305 సీట్ల నుంచి 240 స్థానాలకు పడిపోయిందని చెప్పారు. బిహార్, ఏపీ సీఎంలు నీతీశ్కుమార్, చంద్రబాబునాయుడిపై ఆధారపడి పరిపాలన సాగించాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బలమైన ప్రతిపక్షం కలిగిన ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారని, వాటిని సవరించాలని కోరారు. తెలంగాణలో భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నంత మాత్రాన విపక్షం లేకుండా పోదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి వంటి నేతలు విపక్ష సభ్యులను చేర్చుకున్నారని, ఆయా సందర్భాల్లో ప్రజలు విపక్షాల వైపు మళ్లారని గుర్తుచేశారు. తెలంగాణలో భాజపా బలపడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని సూచించారు. రాష్ట్ర సమితి సమావేశాల్లో పార్టీ కార్యక్రమాలను చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఎస్కె.సాబీర్పాషా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె.జానీమియా పాల్గొన్నారు.
కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడాలి: కూనంనేని
పాలకవర్గాలు ప్రజా సమస్యలను విస్మరిస్తే కమ్యూనిస్టులు ప్రజలు పక్షాన పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మంలోని ఆర్ఆర్ఆర్ వేడుకల మందిరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలు గత ఎన్నికల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, దీన్ని గుర్తించి విద్వేషాలకు తిలోదకాలివ్వాలని హితవు పలికారు. పార్టీ సభ్యులకు నిరంతర రాజకీయ, సైద్ధాంతిక శిక్షణ ఇవ్వనున్నట్లు, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను వాడవాడలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక మృతి
[ 03-07-2024]
తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాచలంలోని సుభాష్నగర్లో చోటు చేసుకుంది. -
కారు లిఫ్ట్ అడిగి.. కళ్లలో కారం కొట్టి
[ 03-07-2024]
కారులో వస్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై సార్ ప్లీజ్ లిప్ట్ ఇవ్వండని అడిగి.. కారు ఆపిన వెంటనే ఆ వ్యక్తిని బెదిరించి దుండగులు సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీప ప్రధాన రహదారిపై చోటుచేసుకొంది. -
ప్రజా శ్రేయస్సే ప్రాతిపదిక!
[ 03-07-2024]
కాలానికి అనుగుణంగా పుట్టుకొస్తున్న నేరాలకు సంబంధించి కొత్త సెక్షన్లు, శిక్షలు విధించటానికి నూతన నేర, న్యాయ చట్టాలు దోహదపడతాయి. -
అనుసంధానించేలా.. అవసరాలు తీరేలా..
[ 03-07-2024]
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో పలు గ్రామాలను అనుసంధానించేందుకు సాగర్ ప్రధాన కాలువపై కొత్తగా వంతెనలు నిర్మించాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదించారు. -
పల్లె దవాఖానాలకు సుస్తీ..!
[ 03-07-2024]
పల్లె దవాఖానాల సేవలు ప్రహసనంలా మారాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో తరుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం..!
[ 03-07-2024]
నూతన నేర, న్యాయ చట్టాల ద్వారా పోలీసుల విచారణ వేగవంతమవుతుందని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందటంతో పాటు నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు. -
మధ్యాహ్నభోజనం.. శుచికరం.. రుచికరం!
[ 03-07-2024]
సర్కారు బడుల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
పర్యావరణ సంచులతో ఆరోగ్యం పదిలం
[ 03-07-2024]
‘‘ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు తగ్గించాలనే లక్ష్యంతో బ్యాగ్ ఫ్రీ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2010 జులై 3 నుంచి అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచి రహిత దినం నిర్వహిస్తున్నారు.’’ -
అశ్రునయనాలతో రైతు అంత్యక్రియలు
[ 03-07-2024]
రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
లోగుట్టు ఏంటి?
[ 03-07-2024]
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులతో ఠాణా సిబ్బంది అంటకాగారనే అవినీతి మరకలు, ఉన్నతాధికారుల వేధింపులే శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
మిలీషియా సభ్యుడు లొంగుబాటు
[ 03-07-2024]
భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట మంగళవారం మావోయిస్టు మిలీషియా సభ్యుడు మడవి జోగా లొంగిపోయాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ వన్గా హార్దిక్ పాండ్య.. 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా
-
రజనీకాంత్, విజయ్ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!
-
రోహిత్-విరాట్ నిర్ణయంతో షాక్ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్
-
జగన్ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం
-
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
-
మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు