logo

Bhadrachalam: తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక మృతి

తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాచలంలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకుంది.

Updated : 03 Jul 2024 11:00 IST

భద్రాచలం: తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాచలంలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకుంది. సోమవారం మంచంపై ఆడుకుంటూ కిందపడటంతో రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం బాలికకు వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని