తీరం.. కకావికలం
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి.
కొనసాగుతున్న భారీ వర్షాలు
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. హొన్నావర సమీపంలోని వర్నకేరి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. కార్వార నుంచి సాగర మీదుగా శివమొగ్గకు వెళ్లే జాతీయ రహదారిపై వాహన సంచారాన్ని ఇతర మార్గాలకు మళ్లించారు. సిరసి, యల్లాపుర, సిద్ధాపురల్లో పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలు వర్షంతో మరింత దెబ్బతిన్నాయి. సిరసి- కుమట మధ్య అఘనాశిని నది జోరందుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. పలు వంకలు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. ఈ మార్గంలో వెళుతున్న ఒక బస్సు ప్రవాహంలో చిక్కుకుంది.
స్థానికులు ముందుకు వచ్చి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యల్లాపుర తాలూకా నాతోడి జలపాతం వద్దకు పర్యాటకులు రాకుండా నిర్బంధాన్ని విధించారు. భట్కళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హొన్నావరలో గుండబాళె నది ప్రమాద స్థితిని దాటి ప్రవహిస్తోంది. తాలూకాలోని ఐదు గ్రామాలకు ప్రధాన రహదారితో సంబంధాలు తెగిపోయాయి. ప్రవాహ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హొన్నావర తాలూకాలోని పాఠశాలలకు ఉత్తర కన్నడ జిల్లాధికారి గంగూబాయి మానకర్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఉడుపి జిల్లా బైందూరు తాలూకాలోని పాఠశాలలకు క్షేత్ర విద్యాశాఖ అధికారి సెలవు ఇచ్చారు. బైందూరు సమీప కటీలులో దుర్గాపరమేశ్వరి ఆలయ గర్భగుడిలోకి వరదనీరు చేరుకుంది.
కొడగు జిల్లా కుశాలనగర తాలూకా రంగసముద్రంలోని చిక్లిహొళె జలాశయం నిండిపోయింది. ఇందులో అర టీఎంసీ నీటిని మాత్రమే నిలువ చేసుకునేందుకు అవకాశం ఉంది. అర్ధచంద్రాకారంలో ఉన్న కట్ట పైనుంచి నీరు కిందకు జాలువారడాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు జలాశయం వద్దకు వస్తున్నారు. జలాశయానికి ఎమ్మెల్యే మంథర్ గౌడ వాయినాన్ని సమర్పించారు. ఉడుపి జిల్లా కొల్లూరులో ఇంటిపైకి కొండరాళ్లు పడడంతో గోడ కూలి అంబ (45) అనే మహిళ మరణించింది. ఆగుంబె ఘాట్లో వెళుతున్న ఓమ్నిపై భారీ వృక్షం పడడంతో అది ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి, సహ ప్రయాణికుడు చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుంగ, కావేరి నదుల్లో ప్రవాహం పెరిగింది. నది పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి నీరు చేరుకుంది. గాజనూరు వద్ద తుంగా జలాశయం నిండడంతో 22 క్రష్ట్ గేట్లలో 14 గేట్లను పాక్షికంగా పైకి ఎత్తారు. కేఆర్ఎస్లో ఇన్ఫ్లో పెరగడంతో గురువారం మధ్యాహ్నానికి 99.30 అడుగుల ఎత్తుకు నీరు చేరుకుంది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకాలో కణకుంబి, జాంబోటి, నాగరగాళి, భీమగఢ, లోండా అటవీ ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మలప్రభ, మహాదాయి, పండరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం వరకు, తీరప్రాంత జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోమయంలో వృత్తి విద్య
[ 07-07-2024]
అన్నీ సవ్యంగా ఉంటే ఇప్పటికే రాష్ట్ర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ర్యాంకులు వెల్లడించి ఉండేవారు. విద్యార్థులు సైతం తమకు అనువైన కళాశాలల్లో ప్రవేశాలు, అవసరమైన ఫీజుల కోసం కసరత్తు ప్రారంభించేవారు. -
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
[ 07-07-2024]
చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై కారాగారంలో ఉన్న సినీనటుడు దర్శన్కు రూ.40 లక్షలు సమకూర్చిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె మాజీ ఉపమేయర్ మోహన్రాజ్, ‘డెవిల్’ సినిమా దర్శకుడు మిలన్ ప్రకాశ్ను పోలీసులు శుక్ర, శనివారాల్లో వేర్వేరుగా విచారించారు. -
లాఠీకి మరింత పదును
[ 07-07-2024]
శాంతిభద్రతల రక్షణకోసం నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. -
భారీవర్షాలు.. ఉప్పొంగిన నదులు
[ 07-07-2024]
దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, బెళగావి, కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, హాజన జిల్లాల్లో వరుణుడి హోరు కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ అన్ని చోట్లా వాగులు, వంకలు హోరెత్తాయి. -
ఉప లోకాయుక్తగా జస్టిస్ వీరప్ప
[ 07-07-2024]
నూతన ఉప లోకాయుక్తగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.వీరప్ప శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ గ్లాస్ హౌస్లో గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆయనకు ప్రమాణ వచనాన్ని బోధించారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి దుర్మరణం
[ 07-07-2024]
శివమొగ్గ నగర శివారు తావరకొప్ప సింహధామ ట్రీ పార్కు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. -
పాలికె అధికారులపై లోకాయుక్త దాడి
[ 07-07-2024]
నగర పాలికెలో లేఅవుట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అధికారులపై లోకాయుక్త అధికారులు శనివారం దాడి చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు