logo

వాయుసేన సంబరాల హోరు

దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్‌ఫోర్స్‌ టెక్నికల్‌) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది.

Published : 05 Jul 2024 03:45 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్‌ఫోర్స్‌ టెక్నికల్‌) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు 75 కి.మీ. సైకిల్‌ జాతాను నిర్వహించారు. ఫస్ట్‌డే కవర్‌ను ఎయిర్‌ మార్షల్‌ నాగేశ్‌ కపూర్‌ ఆవిష్కరించి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కళాశాల ఆవరణలో ఉద్యోగినులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. గత ఏడున్నర దశాబ్దాలుగా సంస్థ సేవలను ఎయిర్‌ కమాండర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని