ఉద్యాననగరికి రైల్వే వలయమార్గం!
నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.
నగరాన్ని చుట్టేసే ‘రింగ్ రైలు’
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ ఈ పథక కార్యాచరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పనులు పూర్తి చేయాలనేది ప్రాథమిక ఆలోచన. రింగ్ (వలయ) రైలు మార్గం 2025 మార్చినాటికి పూర్తి చేయడానికి వీలుగా ప్రతిపాదనలుంటాయి. ఇప్పటికే నగరం చుట్టూ రైలు మార్గం విస్తరించింది. ఈ వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయాలని హెచ్.డి.దేవేగౌడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదించినా ఎందుకో వెనుకబడిపోయింది. ఆపై అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అసలేమీ పట్టించుకోలేదు. నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా వి.సోమణ్ణ బాధ్యతలు చేపట్టాక ఈ అంశానికి ప్రాధాన్యమేర్పడింది. నమ్మ మెట్రో, సబర్బన్ రైలుతో పాటు ‘రింగ్ రైలు’ ఉత్తమ రవాణా వేదికగా గుర్తించారు. నగరం చుట్టూ 287 కిలోమీటర్ల పొడవునా రైళ్లను నడిపితే అనేక ప్రాంతాలకు రాకపోకలు సుగమమవుతాయి. దేవనహళ్లి, హీలలిగె, దొడ్డబళ్లాపుర, నెలమంగల, నిడవంద, సోలూరు, మాలూరు ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్ రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడం సులువని రైల్వే అధికారులు ఇదివరకే ప్రకటించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనూ ఓసారి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆదేశాలిచ్చారు. ప్రస్తుత రైలుమార్గాలను కొన్నిచోట్ల అనుసంధానం చేయాలి. దాని కోసం కొన్ని రైల్వే స్టేషన్ల నిర్మాణం, భూస్వాధీన ప్రక్రియ చేపట్టాలి. రానున్న మూడు దశాబ్దాలపాటు ట్రాపిక్ ఇక్కట్లు ఎదురుకాకుండా రింగరైలు సేవలందిస్తుందని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే