హద్దులు దాటుతున్న దర్శన్ అభిమానులు.. బాధపెడుతున్న విపరీత పోకడలు!
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్ అభిమానులు హద్దులు దాటుతున్నారు.
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్ అభిమానులు హద్దులు దాటుతున్నారు. వారి విపరీత పోకడలు పలువురిని బాధపెడుతున్నాయి. దర్శన్కు కేటాయించిన విచారణ ఖైదీనంబరు- 6106ను పలువురు చేతులు, ఛాతీపై పచ్చ వేయించుకున్నారు. ఒక అభిమాని గోడపై దర్శన్ చిత్రాన్ని, ఖైదీనంబరు రాసి సామాజిక మాధ్యమంలో ఉంచాడు.
ఒక వ్యక్తి తన నవజాత శిశువు చొక్కాపై ఖైదీనంబరు రాశాడు. పక్కనే సంకెళ్లు, దర్శన్ అభిమాని అని నంబరు వేసి ఆ ఫొటోను పోస్టు చేశాడు. తన కుమారుడి మొదటి పుట్టిన రోజులను ఇలా ఆచరించుకున్నానని ఆ పోస్టులో వివరించాడు. పరప్పన కారాగారం వద్ద దర్శన్ను చూసేందుకు వస్తున్న అభిమానుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నటుడు ధన్వీర్ గౌడ కారాగారంలో ఉన్న దర్శన్ను మంగళవారం కలసి మాట్లాడారు. ఆయన నిరాశతో ఉన్నారని, బ్యారక్లో నడవడం, పుస్తకాలు చదవడం, నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నారని ధన్వీర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
-
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ