logo

హద్దులు దాటుతున్న దర్శన్‌ అభిమానులు.. బాధపెడుతున్న విపరీత పోకడలు!

తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్‌ అభిమానులు హద్దులు దాటుతున్నారు.

Updated : 03 Jul 2024 12:46 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్‌ అభిమానులు హద్దులు దాటుతున్నారు. వారి విపరీత పోకడలు పలువురిని బాధపెడుతున్నాయి. దర్శన్‌కు కేటాయించిన విచారణ ఖైదీనంబరు- 6106ను పలువురు చేతులు, ఛాతీపై పచ్చ వేయించుకున్నారు. ఒక అభిమాని గోడపై దర్శన్‌ చిత్రాన్ని, ఖైదీనంబరు రాసి సామాజిక మాధ్యమంలో ఉంచాడు.

ఒక వ్యక్తి తన నవజాత శిశువు చొక్కాపై ఖైదీనంబరు రాశాడు. పక్కనే సంకెళ్లు, దర్శన్‌ అభిమాని అని నంబరు వేసి ఆ ఫొటోను పోస్టు చేశాడు. తన కుమారుడి మొదటి పుట్టిన రోజులను ఇలా ఆచరించుకున్నానని ఆ పోస్టులో వివరించాడు. పరప్పన కారాగారం వద్ద దర్శన్‌ను చూసేందుకు వస్తున్న అభిమానుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నటుడు ధన్వీర్‌ గౌడ కారాగారంలో ఉన్న దర్శన్‌ను మంగళవారం కలసి మాట్లాడారు. ఆయన నిరాశతో ఉన్నారని, బ్యారక్‌లో నడవడం, పుస్తకాలు చదవడం, నిద్రపోతూ కాలం వెళ్లదీస్తున్నారని ధన్వీర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని